News March 31, 2025

నేడు చింతూరులో అత్యధిక ఉష్ణోగ్రత: APSDMA

image

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని APSDMA అంచనా వేసింది. చింతూరులో అత్యధికంగా 45.3 డిగ్రీలు, కూనవరంలో 43, నెల్లిపాక 41.2, వరరామచంద్రాపురం 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అడ్డతీగల, అనంతగిరి, చింతపల్లి, గంగవరం, గూడెంకొత్తవీధి, మారేడుమిల్లి, వై.రామవరం, రంపచోడవరంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.

Similar News

News January 9, 2026

గోరంట్లలో మృతదేహం లభ్యం

image

గుర్తుతెలియని మృతదేహం లభ్యం అయినట్లు గోరంట్ల సీఐ బోయశేఖర్ తెలిపారు. రెడ్డిచెరువు పల్లికి వెళ్లే దారిలోని చెట్ల పొదల్లో మృతదేహం కనపడినట్లు వీఆర్ఓ అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మృతదేహం సమీపంలో బీడీ కట్టలు, అగ్గిపెట్టె, తట్ట ఉన్నాయని, యాచకుడిగా భావిస్తున్నామని, ఎవరైనా గుర్తిస్తే తెలియజేయాలని పేర్కొన్నారు.

News January 9, 2026

శరీరానికి కొల్లాజెన్ ఎందుకు అవసరమంటే?

image

కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. ఇది కండరాలు, కీళ్ళు, చర్మం, జుట్టు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. శరీరం దానిని సహజంగా ఉత్పత్తి చేస్తుంది. కానీ వయస్సు పెరుగుతున్నకొద్దీ ఈ ప్రక్రియ మందగిస్తుంది. శరీరంలో కొల్లాజెన్ స్థాయి తగ్గినప్పుడు చర్మం ముడతలు పడడం, మొటిమలు రావడం, ఎముకలు బలహీనపడటం, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కండరాలను దృఢంగా మార్చడంలో కూడా కొల్లాజెన్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

News January 9, 2026

నరదిష్టి ప్రభావం తొలగిపోవాలంటే?

image

నరదిష్టి ప్రభావంతో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వాటి నుంచి బయటపడటానికి జ్యోతిష నిపుణులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. ‘సముద్ర జలాలను ఇల్లు, వ్యాపార స్థలాల్లో చల్లాలి. దొడ్డు ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయాలి. మంగళవారం ఎరుపు వస్త్రంలో ఉప్పు కట్టి ఇంటి ముందు వేలాడదీయాలి. మరుసటి రోజు చెట్టు మొదట్లో వేయాలి. సాంబ్రాణి ధూపం, వినాయకుడి వద్ద దీపం వెలిగించడం మంచి ఫలితాలను ఇస్తాయి’ అంటున్నారు.