News March 31, 2025
వివాహితపై సామూహిక అత్యాచారం

TG: నాగర్ కర్నూల్ (D) ఊర్కొండ(M)లో వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. MBNR జిల్లాకు చెందిన ఆమె బంధువుతో కలిసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. కాలకృత్యాల కోసం గుట్ట ప్రాంతానికి వెళ్లగా, 8 మంది ఆ బంధువుపై దాడి చేసి అతని చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ తర్వాత వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటనకు పాల్పడ్డ వారిని గుర్తించిన పోలీసులు, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News April 11, 2025
అమెరికాపై 125% టారిఫ్ విధించిన చైనా

అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ మరింత ముదురుతోంది. అమెరికాకు కౌంటర్గా చైనా సుంకాలు పెంచింది. నిన్న చైనా ఉత్పత్తులుపై అమెరికా 145% టారిఫ్ విధించగా ఇవాళ చైనా 125% సుంకం విధించింది. డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా బెదిరించాలని చూస్తున్నారని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు యూరోపియన్ యూనియన్ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
News April 11, 2025
అకౌంట్లోకి రూ.20,000.. కీలక ప్రకటన

AP: దేశంలో ఎక్కడా లేని విధంగా తాము పెన్షన్లు అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం కింద అర్హులైన వారికి రూ.15వేలు అందిస్తామన్నారు. మే నుంచి రైతులకు విడతల వారీగా రూ.20వేలు(కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి) ఇస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
News April 11, 2025
నన్నే మోసం చేస్తున్నారు.. మీరో లెక్కా: చంద్రబాబు

AP: సీఎంనైన తననే మోసం చేస్తున్నారని వడ్లమాను సభలో CM చంద్రబాబు తెలిపారు. ‘CMగా ఉన్నప్పుడు ఓరోజు ఉదయం లేచేసరికి YS వివేకానంద గుండెపోటుతో మరణించారని చెప్పారు. కానీ అది గుండెపోటు కాదు.. గొడ్డలివేటు. ఆ విషయం తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఒక ముఖ్యమంత్రినే మోసం చేయగలుగుతున్నారంటే మీరొక లెక్కా. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ఈ రోజుల్లో వారిని సమర్థంగా ఎదుర్కోవాలి కదా?’ అని అన్నారు.