News March 31, 2025

ముస్లింలకు PM మోదీ ఈద్-ఉల్-ఫితర్ విషెస్

image

దేశంలోని ముస్లింలకు PM నరేంద్ర మోదీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరిలో శాంతి, దయాగుణం పెంపొందాలన్నారు. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు దేశంలోని అన్ని పాంతాల్లో ముస్లింలు ఈద్గాలకు చేరుకొని పవిత్ర రంజాన్ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆలింగనం చేసుకొని ఒకరికొకరు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.

Similar News

News April 6, 2025

గ్రేట్..అన్నదాతల కోసం 131రోజుల నిరాహార దీక్ష

image

పంటలకు సరైన మద్దతు ధర ఇవ్వాలని 131 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన రైతు కేంద్రమంత్రుల హామీతో నేడు దీక్ష విరమించారు. పంజాబ్‌కు చెందిన జగజీత్ సింగ్ దల్లేవాల్ రైతుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ గతేడాది నవంబర్ 26న దీక్ష చేపట్టారు. అతని ఆరోగ్యం విషమించడంతో వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, రైల్వేశాఖ సహాయ మంత్రి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతు దీక్ష విరమించారు.

News April 6, 2025

భూసేకరణ వేగవంతం చేయండి.. సీఎంకు కేంద్రమంత్రి లేఖ

image

తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణానికి భూసేకరణ వేగవంతం చేయాలని CM రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ‘ప్రస్తుతం TGలో ₹12,619Crతో 691KM పొడవైన రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందుకు 1,550హెక్టార్ల భూమి అవసరం కాగా 904హెక్టార్లనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. మిగతా భూమిని త్వరగా సేకరిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయి. రవాణా వ్యవస్థ మెరుగుపడి అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు.

News April 6, 2025

IDBIలో 119 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల

image

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లోని పలు విభాగాల్లో 119 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి ఈ నెల 20 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంబీఏ చేసిన వారు అర్హులు. SC/STలు రూ.250, మిగతా వారు రూ.1,050 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>https://www.idbibank.in/<<>>

error: Content is protected !!