News March 31, 2025

బెట్టింగ్ యాప్స్.. సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

image

TG: బెట్టింగ్ యాప్స్ వ్యవహరంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT)ను ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ ప్రధాన అధికారిగా ఐజీ రమేశ్‌ను నియమించారు. ఇందులో సభ్యులుగా ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మీ, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్‌ను పేర్కొన్నారు. ఇప్పటికే 25 సెలబ్రిటీలపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవ్వగా ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.

Similar News

News November 13, 2025

బిహార్‌లో SIRపై ఒక్క అప్పీల్ కూడా రాలేదు: EC

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 67.13% పోలింగ్ నమోదైనట్లు EC అధికారికంగా ప్రకటించింది. 1951 నుంచి ఇదే అత్యధికమని తెలిపింది. 38 జిల్లాల్లో ఎక్కడా రీపోల్ కోసం అప్పీల్స్ రాలేదని తెలిపింది. 7,45,26,858 మంది ఓటర్లతో తుది జాబితా రిలీజ్ చేశామని, ఎక్కడా SIRపై అప్పీల్ చేయలేదని వెల్లడించింది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుందని చెప్పింది. ఇందుకోసం 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

News November 13, 2025

ఇతిహాసాలు క్విజ్ – 65 సమాధానాలు

image

ప్రశ్న: దేవవ్రతుడు ఎవరు? ఆయన ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఆ ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది?
శంతనుడు, గంగాదేవి ఎనిమిదవ కుమారుడు ‘దేవవత్రుడు’. హస్తినాపురానికి రాజుగా కాబోనని, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భయంకరమైన ప్రతిజ్ఞ చేసినందుకు ఆయనకు ‘భీష్ముడు’ అనే పేరు వచ్చింది. శంతనుడి సంతోషం కోసం, తన తండ్రి పెళ్లి చేసుకొనే సత్యవతి పుత్రులకు రాజ్యాధికారం దక్కాలని భీష్ముడు ఈ ప్రతిజ్ఞ చేశాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 13, 2025

కొండా సురేఖ క్షమాపణలు.. కేసు విత్‌డ్రా చేసుకున్న నాగార్జున

image

TG: మంత్రి కొండా సురేఖ <<18263475>>క్షమాపణలు<<>> చెప్పడంతో సీనియర్ హీరో నాగార్జున పరువునష్టం కేసును విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో నాంపల్లి కోర్టు ఆ కేసును కొట్టివేసింది. కాగా నిన్న కొండా సురేఖ నాగార్జునకు ట్విటర్ (X) వేదికగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. సమంత విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనం రేపాయి. దీంతో నాగార్జున ఆమెపై పరువునష్టం దావా వేశారు.