News March 31, 2025
కామారెడ్డి జిల్లాలో మండుతున్న ఎండలు

కామారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. బిచ్కుంద మండలంలో అత్యధికంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత, నస్రుల్లాబాద్ రామారెడ్డి మద్నూర్లో 40.9, కామారెడ్డి నిజాంసాగర్, గాంధారి మండలాల్లో 40.7, దోమకొండ, పాల్వంచ మండలాల్లో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.
Similar News
News April 3, 2025
సంగారెడ్డి: 56 ఇళ్లకు ఇందిరమ్మ నిధులు విడుదల

జిల్లాలో బేస్ మీట్ వరకు పూర్తి చేసిన 56 ఇళ్లకు లక్ష చొప్పున రూపాయల నిధులు వారి ఖాతాలో జమ చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. జిల్లాలోని 25 మండలాల్లో 1200 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. మిగిలిన వారు కూడా బేస్ మీట్ వరకు నిర్మిస్తే లక్ష చొప్పున నిధులు వారి ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు.
News April 3, 2025
పాయింట్స్ టేబుల్ టాప్లో పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2025లో రెండు వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికల పంజాబ్ కింగ్స్ టాప్లో నిలిచింది. ఢిల్లీ కూడా ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి ఎరగకుండా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు టాప్లో ఉన్న ఆర్సీబీ.. గుజరాత్పై ఓటమితో మూడో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత GT, MI, LSG, CSK, SRH, RR, KKR కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగే SRH vs KKR మ్యాచ్ తర్వాత సమీకరణాలు మారే ఛాన్స్ ఉంది.
News April 3, 2025
నారాయణపేట: టెన్త్ క్లాస్ పాసయ్యారా..? మీ కోసమే..!

సేవా భారతి, ఇన్ఫోసిస్ నిర్మాణ్ ఆధ్వర్యంలో ఈనెల 4న నారాయణపేట నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు సేవా భారతి పాలమూరు విభాగ్ కార్యదర్శి శ్రీనివాస్ గౌస్ బుధవారం తెలిపారు. జిల్లాలోని టెన్త్ క్లాస్, ఐటీఐ, ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదువుతున్న, సమానమైన అర్హతలు ఉన్న విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. శుక్రవారం ఉ.10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు.