News March 31, 2025

పవిత్ర ఖురాన్ బోధనలు సమాజానికి మేలు చేస్తున్నాయి: గవర్నర్ 

image

రంజాన్ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడ రాజ్ భవన్ నుంచి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పవిత్ర ఖురాన్ బోధనలు సమాజానికి మేలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేసే ముస్లింలంతా భగవంతుడికి చేరువ అవుతారని గవర్నర్ వ్యాఖ్యానించారు. 

Similar News

News November 22, 2025

WGL సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వ్యయం పెంపులో అక్రమాలు?

image

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అంచనా వ్యయం భారీగా పెంచినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్ధారించింది. అనుమతులు లేకుండా గత ప్రభుత్వం మౌఖిక ఆదేశాలతో వ్యయాన్ని రూ.625 కోట్లకు పైగా పెంచినట్టు నివేదికలో తేలింది. ఇదే సమయంలో ఆస్పత్రి భూ అక్రమాలు, జైలు భూముల తాకట్టు అంశాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ఫోరెన్సిక్ నివేదిక వచ్చినా.. విజిలెన్స్ నివేదిక పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వం చర్యలను నిలిపివేసింది.

News November 22, 2025

నెల్లూరు: భార్య.. భర్త.. ఓ ప్రియురాలు

image

వివాహితుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలిగిరిలో జరిగింది. ఏపినాపి గ్రామానికి చెందిన విష్ణువర్ధన్‌కు సరితతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. కాగా ఇటుకబట్టీల వద్ద పనిచేసే క్రమంలో ధనలక్ష్మితో పరిచయమై వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈక్రమంలో వీరు ప్రకాశం(D) పామూరులో ఉన్నారని తెలియడంతో సరిత తన భర్తను కలిగిరికి తీసుకొచ్చింది. ప్రియురాలిని దూరం చేశారంటూ విష్ణువర్ధన్ ఆత్మహత్యకు యత్నించగా భార్య ఆసుపత్రిలో చేర్చింది.

News November 22, 2025

ఏలూరు: అప్డేట్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థులు ఎదురుచూపులు

image

ట్రైనింగ్‌పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్‌పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.