News March 31, 2025
గ్రూప్-1లో రఘునాథపల్లి యువకుడికి 332వ ర్యాంకు

గ్రూప్-1 ఫలితాల్లో రఘనాథపల్లి యువకుడు సత్తా చాటారు. కొయ్యడ ప్రభాకర్-లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు ఉదయ్ ఆదివారం TGPSC ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో 463 మార్కులు సాధించి 332వ ర్యాంకు పొందారు. ఈయన ప్రస్తుతం సింగరేణిలో పర్సనల్ మేనేజర్గా పని చేస్తున్నారు. ఉదయ్ సోదరుడు ప్రణయ్ 2023లో IASగా ఎంపికై ప్రస్తుతం HYDలో పోస్టింగ్ తీసుకున్నారు. ఉదయ్ గ్రూప్-1 ఉద్యోగం సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News January 14, 2026
పసిడిని మించిన ప్రసాదం.. మేడారం ‘బంగారం’

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అంటేనే మనకు గుర్తొచ్చేది ‘బంగారం’. ఇక్కడ బంగారం అంటే పసిడి కాదు.. సాక్షాత్తు బెల్లం. రాబోయే జనవరి 28 నుండి ప్రారంభం కానున్న మహా జాతరలో కోట్లాది మంది భక్తులు అమ్మవార్లకు సమర్పించే అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం ఇదే. భక్తులు తమ బరువును తూచుకొని తమ బరువుకు సమానమైన బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. దీన్నే ‘నిలువెత్తు బంగారం’ అంటారు.
News January 14, 2026
ప్యాసింజర్ వెహికల్స్కు పెరుగుతున్న డిమాండ్

కార్లు, ఆటోలు వంటి ప్యాసింజర్ వెహికల్స్కు ఏటా డిమాండ్ పెరుగుతోంది. గతంతో పోలిస్తే 2025 DECలో కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా అయిన వాహనాలు 27% పెరిగాయని SIAM పేర్కొంది. ‘ప్యాసింజర్ వెహికల్స్ గతనెలలో 3,99,216 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 DECతో పోలిస్తే 26.8% ఇవి అధికం. టూవీలర్స్ డిస్పాచ్ కూడా 39% పెరిగింది. 2025 DECలో ఇవి 15,41,036 యూనిట్లు సరఫరా కాగా 2024 ఇదే నెలలో 11,05,565 వెళ్లాయి’ అని తెలిపింది.
News January 14, 2026
ADB: డీసీసీ – కంది వర్గాల మధ్య కుదరని సయోధ్య!

జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదనడానికి ఇటీవల జరుగుతున్న కార్యక్రమాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ నియామకం తర్వాత కొత్త పాత నేతల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోతాయని పార్టీ శ్రేణులు అనుకున్నారు. కానీ ఇటీవల డీసీసీ చేపట్టే కార్యక్రమాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ఆయన చేపట్టే కార్యక్రమాల్లో నరేష్ జాదవ్ పాల్గొనకపోవడం జిల్లాలో చర్చకు దారితీసింది.


