News March 31, 2025
ఆ 400 ఎకరాలు మాదే: టీజీ ప్రభుత్వం

TG: భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ HCU విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఆ 400 ఎకరాల భూమి తమదేనని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇందులో HCUకు సంబంధించిన భూమి లేదని స్పష్టం చేసింది. ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకున్నట్లు పేర్కొంది. భూమికి సంబంధించి ఎలాంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని తెలిపింది. వేలం, అభివృద్ధి కోసం రాళ్ల తొలగింపు ఉండదని చెప్పింది.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>