News March 31, 2025
సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 16వ వార్డులోని రేషన్ షాపులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ఆర్డీవో రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
Similar News
News January 15, 2026
17న కాకినాడకు సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 17వ తేదీ శనివారం కాకినాడలో పర్యటించనున్నారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి బీచ్ రోడ్డులోని గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ను ప్రారంభిస్తారు. అనంతరం ప్రజాప్రతినిధులతో సమావేశమై చర్చిస్తారు. పర్యటన ముగించుకుని సాయంత్రం తిరిగి ఉండవల్లి చేరుకుంటారు. CM పర్యటన నిమిత్తం జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.
News January 15, 2026
ప.గో: ఈ కోడికి క్రేజ్ మామూలుగా లేదుగా..!

గోదావరి జిల్లాలో సంక్రాంతి బరుల్లో ‘కోజా’కు భలే గిరాకీ ఏర్పడింది. చిన్ననాటి నుంచి ప్రత్యేక పౌష్టికాహారంతో పెంచడంతో.. ఈ మాంసానికి ప్రియుల నుంచి విశేష డిమాండ్ ఉంది. బరువును బట్టి వేల రూపాయలు పలికే ఈ కోజాలను పందెం విజేతలు విక్రయిస్తుండగా.. మరికొందరు ప్రముఖులకు, అధికారులకు విందు కోసం కానుకగా పంపిస్తున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పుంజులకు క్రేజ్ తగ్గకపోవడం విశేషం.
News January 15, 2026
స్పైస్ బోర్డ్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP: గుంటూరులోని స్పైస్ బోర్డ్ 3 SRD ట్రైనీస్, ట్రైనీ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. బీఎస్సీ అర్హత గల వారు ఫిబ్రవరి 4న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. నెలకు జీతం రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.indianspices.com


