News March 31, 2025
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన రంజాన్ : VZM SP

విజయనగరం జిల్లాలో రంజాన్ పండగ హిందూ – ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటి మత విద్వేషాలు, సంఘర్షలు, అల్లర్లు జరగకుండా ప్రశాంతయుతంగా ముగిసినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాన జిల్లాలో ఎటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు భద్రత చర్యలు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు.
Similar News
News February 24, 2026
VZM: పీఎం శ్రీ పాఠశాలల తనిఖీకి కేంద్ర నోడల్ అధికారి

పీఎం శ్రీ పాఠశాలల అమలును పరిశీలించేందుకు జిల్లాకు కేంద్ర నోడల్ అధికారిగా జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి నీరజ్ కుమార్ గయాగిని నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని మంగళవారం కలిశారు. విజయనగరం జిల్లాలో 37 పీఎం శ్రీ పాఠశాలలు ఉన్నాయని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధే ఈ పథకం లక్ష్యమని కలెక్టర్ చెప్పారు. 2022-24 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.60 కోట్ల నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.
News February 24, 2026
మైనర్ డ్రైవింగ్కు స్వస్తి పలకాలి: VZM SP

మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, దీని వల్ల ప్రమాదాలు పెరుగుతాయని ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయం నుంచి మాట్లాడారు. 18 ఏళ్ల లోపు వారికి డ్రైవింగ్ అర్హత లేదని, అనుభవం లేకపోవడం వల్ల రహదారి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. మైనర్లు ప్రమాదాలకు కారణమైతే తల్లిదండ్రులు, వాహన యజమానులే చట్టపరంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
News February 24, 2026
VZM: మార్చి 8న గురుకుల పాఠశాల్లో ప్రవేశ పరీక్ష

విద్యా సంవత్సరంలో ఏపీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 6-10వ తరగతులకు మార్చి 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ ఎం.మాణిక్యం తెలిపారు. 5వ తరగతి ఇంటర్ ప్రవేశ పరీక్ష యధావిధిగా మార్చి1న జరుగుతుందన్నారు. సమ్మేటివ్ అసెస్మెంట్టు పరీక్షలు ఉన్న కారణంగా 6, 7, 8, 9, 10వ తరగతులకు మార్చి 2న జరగాల్సిన పరీక్ష వాయిదా వేసినట్లు ప్రకటించారు.


