News March 31, 2025
MBNR: ‘అంబేడ్కర్ జాతర విజయవంతం కావాలి’

మహబూబ్నగర్ పట్టణంలోని ఎంబీసీ మైదానంలో నిర్వహించనున్న పూలే – అంబేడ్కర్ జాతర పోస్టర్ను మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. పూలే -అంబేడ్కర్ జాతర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోయపల్లి నర్సింహులు, వేంకట స్వామి, సామెల్, సిరసనోళ్ల బాలరాజు, గువ్వ లక్ష్మణ్ తదితరులున్నారు.
Similar News
News April 9, 2025
గ్రూప్-2 పోస్టుల భర్తీ.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలివే

AP: స్పోర్ట్ కోటా, గ్రూప్-1 పరీక్షలు రాయబోయే అభ్యర్థులు మినహా మిగిలిన గ్రూప్-2 అభ్యర్థులకు ఈనెల 21 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు APPSC ప్రకటించింది. విజయవాడ కార్యాలయంలో ఉ.10 నుంచి సా.5.30 గంటల వరకు ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపింది. గ్రూప్-1 పరీక్షలు ఈనెల 27 నుంచి 30 వరకు జరగనుండగా, వాటికి హాజరయ్యే గ్రూప్-2 అభ్యర్థులకు మే 12 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది.
News April 9, 2025
దుబాయ్ టు ముంబై.. సముద్రంలో బుల్లెట్ ట్రైన్!

దుబాయ్ నుంచి ముంబైకి అండర్ వాటర్ బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు యూఏఈకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ ప్లాన్ చేస్తోంది. దీని సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. హైపర్లూప్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో అరేబియన్ సముద్రంలో అల్ట్రా-హై స్పీడ్ ట్రైన్ రానున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా దుబాయ్-ముంబై మధ్య 2వేల కి.మీ దూరాన్ని 2 గంటల్లో చేరుకోవచ్చు.
News April 9, 2025
పెళ్లి తర్వాత ఎందుకిలా? సమాజంలో ఏం జరుగుతోంది?

సమాజంలో మితిమీరిన పోకడలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు/పురుషులు వివాహేతర సంబంధాలతో భార్యలు/భర్తలను చంపుతున్నారు. కొందరు మహిళలు పేగుబంధాన్ని సైతం లెక్కచేయకుండా పిల్లలను అనాథలుగా వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోతున్నారు. కొందరు భర్తలే స్వయంగా తమ భార్యలను ప్రియుళ్లకు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. తాజాగా యూపీలో ఓ తల్లి తన కూతురికి కాబోయే భర్తతో వెళ్లిపోయింది. దీనిపై మీ కామెంట్?