News March 31, 2025
ఆ 400 ఎకరాలపై సర్వే జరగలేదు: హెచ్సీయూ

TG: గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తమదేనని TGIIC <<15947111>>ప్రకటించడాన్ని<<>> హెచ్సీయూ ఖండించింది. 2024 జులైలో వర్సిటీ ప్రాంగణంలో సర్వే జరగలేదని, పరిశీలన మాత్రమే చేశారని పేర్కొంది. భూముల హద్దుల నిర్ణయానికి తాము అంగీకరించలేదని తెలిపింది. ఈ ప్రాంతంలోని పర్యావరణం, జీవవైవిధ్యాన్ని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వర్సిటీకి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం ఉండాలంది.
Similar News
News September 10, 2025
తురకపాలెం వరుస మరణాలపై అధ్యయనం: సత్యకుమార్

AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి కారణాలు తెలుసుకుంటామన్నారు. ‘ఐసీఏఆర్ టీమ్ ఇక్కడ పర్యటించింది. ఇప్పటికే మట్టి, తాగునీటి శాంపిల్స్ సేకరించింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక ఇవాళ వస్తుంది. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ టీమ్ కూడా గుంటూరుకు వస్తోంది’ అని ఆయన తెలిపారు.
News September 10, 2025
ఉద్యాన మొక్కల్లో ఇనుము లోప లక్షణాలు – నివారణ

నేలల్లో సున్నం అధికంగా ఉన్నప్పుడు, సాగునీటిలో బైకార్పోనేట్లు, కార్బోనేట్లు ఎక్కువైనప్పుడు ఉద్యాన మొక్కల్లో ఇనుము లోపం కనిపిస్తుంది. లేత ఆకుల్లో ఈనెలు ఆకుపచ్చగా ఉండి మిగిలిన భాగం పసుపుగా మారుతుంది. క్రమేణా ఆకు పాలిపోయి కాయలు, పిందెలు రాలిపోతాయి. 1 శాతం అన్నభేది ద్రావణాన్ని(10 గ్రా. అన్నభేది+ 5గ్రా. నిమ్మ ఉప్పు) లీటరు నీటికి కలిపి లక్షణాలు తగ్గేవరకు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
News September 10, 2025
విజయవాడలోని సీపెట్లో ఉద్యోగాలు

విజయవాడలోని <