News March 31, 2025
సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలి: పల్లా

టీడీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు నడుచుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం అచ్యుతాపురంలో పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఐదేళ్లు కష్టపడి పార్టీని కార్యకర్తలు అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు.
Similar News
News September 14, 2025
జూబ్లీహిల్స్: వర్షంలోనూ మాగంటి కుమార్తెల పర్యటన..!

జూబ్లీహిల్స్లో BRSని ప్రజలు గెలిపించాలని మాజీ MLA మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశిర కోరారు. ఈ మేరకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈరోజు నియోజకవర్గ పరిధి రహమత్నగర్ డివిజన్ ఓం నగర్ కాలనీలో పర్యటించారు. BRSమహిళా నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతోనే తమ తండ్రి గోపీనాథ్ 3సార్లు గెలిచారన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు.
News September 14, 2025
జూబ్లీహిల్స్: వర్షంలోనూ మాగంటి కుమార్తెల పర్యటన..!

జూబ్లీహిల్స్లో BRSని ప్రజలు గెలిపించాలని మాజీ MLA మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశిర కోరారు. ఈ మేరకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈరోజు నియోజకవర్గ పరిధి రహమత్నగర్ డివిజన్ ఓం నగర్ కాలనీలో పర్యటించారు. BRSమహిళా నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతోనే తమ తండ్రి గోపీనాథ్ 3సార్లు గెలిచారన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు.
News September 14, 2025
RGM: సింగరేణి OCP-5 ప్రాజెక్ట్ను పరిశీలించిన ED

సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ED), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వెంకన్న జాదవ్ శనివారం రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు-5 ను సందర్శించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా ప్రక్రియ పని విధానం గురించి అధికారులతో ప్రస్తావించారు. అనంతరం పవర్ హౌస్ వద్ద ఉన్న పార్కును పరిశీలించి మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. RG-1 GMలలిత్ కుమార్ పాల్గొన్నారు.