News March 31, 2025
నిర్మల్ జిల్లాలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత

నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలోని మామడ మండలం తాండ్ర గ్రామంలో సోమవారం 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధకారులు వెల్లడించారు. సారంగాపూర్ మండలం జాం గ్రామంలో 21.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోత్రత నమోదైందన్నారు. కాగా రాష్ట్రంలో అత్యధికంగా ఆసిఫాబాద్లో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News September 16, 2025
సిరిసిల్ల: బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ సిఐటియు సిరిసిల్ల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్టు కార్యవర్గ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా గీస బిక్షపతి, ప్రధాన కార్యదర్శిగా ఎగమంటి ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీధర్, శ్రీనివాస్, రమేష్, సహాయ కార్యదర్శులుగా నరేందర్, రాజెల్లయ్య, భూమయ్య, వెంకటి, కోశాధికారిగా ప్రభాకర్ ను ఎన్నుకున్నామన్నారు. నూతన కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
News September 16, 2025
సిరిసిల్ల: ‘హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు’

హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ మంగళవారం తీర్పు వెలువరించినట్టు సిరిసిల్ల SP మహేష్ బి గితే తెలిపారు. SP తెలిపిన వివరాలు.. వేములవాడలోని ఓ మామిడి తోటలో మరిపెళ్లి రాజయ్య(64), మంత్రి ఆనందం పనిచేస్తూ ఉండేవారు. ఇద్దరి మధ్యలో గొడవలు రాగా ఆనందం ఏప్రిల్ 29, 2024లో రాజయ్యను పారతో తలపై బాది హత్య చేశాడు. నేరం రుజువు కాగా శిక్ష పడిందన్నారు.
News September 16, 2025
సిరిసిల్ల: ‘SIR కట్టుదిట్టంగా నిర్వహించాలి’

ఓటర్ జాబితా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కట్టుదిట్టంగా నిర్వహించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్లో SIR పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2002 సం. తర్వాత కొత్తగా ఓటర్ నమోదు చేసుకున్న ప్రతి ఓటర్ వివరాలు క్షేత్రస్థాయిలో వెరిఫై చేయాలన్నారు. 40ఇయర్స్ కంటే ఎక్కువ వయసున్న ఓటర్ల జాబితా వెరిఫై చేయాల్సిన అవసరం ఉండదన్నారు.