News March 31, 2025
మయన్మార్: 2వేలకు చేరిన భూకంప మృతుల సంఖ్య

మయన్మార్లో నాలుగురోజుల క్రితం చోటుచేసుకున్న ఘోర భూకంపంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2056మంది చనిపోయినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా.. భూకంప తీవ్రతను ప్రపంచానికి చూపించేందుకు అక్కడికి వెళ్లిన అంతర్జాతీయ మీడియా సంస్థల్ని దేశంలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది.
Similar News
News September 10, 2025
తురకపాలెం వరుస మరణాలపై అధ్యయనం: సత్యకుమార్

AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి కారణాలు తెలుసుకుంటామన్నారు. ‘ఐసీఏఆర్ టీమ్ ఇక్కడ పర్యటించింది. ఇప్పటికే మట్టి, తాగునీటి శాంపిల్స్ సేకరించింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక ఇవాళ వస్తుంది. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ టీమ్ కూడా గుంటూరుకు వస్తోంది’ అని ఆయన తెలిపారు.
News September 10, 2025
ఉద్యాన మొక్కల్లో ఇనుము లోప లక్షణాలు – నివారణ

నేలల్లో సున్నం అధికంగా ఉన్నప్పుడు, సాగునీటిలో బైకార్పోనేట్లు, కార్బోనేట్లు ఎక్కువైనప్పుడు ఉద్యాన మొక్కల్లో ఇనుము లోపం కనిపిస్తుంది. లేత ఆకుల్లో ఈనెలు ఆకుపచ్చగా ఉండి మిగిలిన భాగం పసుపుగా మారుతుంది. క్రమేణా ఆకు పాలిపోయి కాయలు, పిందెలు రాలిపోతాయి. 1 శాతం అన్నభేది ద్రావణాన్ని(10 గ్రా. అన్నభేది+ 5గ్రా. నిమ్మ ఉప్పు) లీటరు నీటికి కలిపి లక్షణాలు తగ్గేవరకు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
News September 10, 2025
విజయవాడలోని సీపెట్లో ఉద్యోగాలు

విజయవాడలోని <