News March 26, 2024
కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాల్సిందే: హైకోర్టు

AP: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతన స్కేలు అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. సవరించిన పే స్కేల్ను 2022 జనవరి 1 నుంచి అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. బకాయిల మొత్తాన్ని 12 వారాల్లో చెల్లించాలని పేర్కొంది. అయితే కేజీబీవీల్లోని బోధనా సిబ్బంది బదిలీలను నిలుపుదల చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
Similar News
News February 20, 2026
బెంగళూరు- BZA మధ్య వందేభారత్ వేయండి.. స్పందించిన లోకేశ్

బెంగళూరులో ఉంటున్న కోస్తాంధ్ర టెకీల రైలు కష్టాలపై ఏపీ మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. బెంగళూరు నుంచి విజయవాడకు వందేభారత్ రైలు కావాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ అంశాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తామని లోకేశ్ భరోసానిచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని MP కేశినేని చిన్నిని కోరారు. ‘వందేభారత్ స్లీపర్’ రైలు తీసుకొచ్చేలా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో చర్చలు జరుపుతున్నట్లు MP తెలిపారు.
News February 20, 2026
RITES లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 20, 2026
‘కాక్టైల్ 2’ క్రేజీ అప్డేట్.. రష్మిక, కృతి సనన్ లెస్బియన్ రొమాన్స్?

బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కాక్టైల్ 2’లో రష్మిక మందన్న, కృతి సనన్ లెస్బియన్ కపుల్గా నటించబోతున్నారనే వార్త ఇప్పుడు సెన్సేషన్గా మారింది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ ఉంటుందని టాక్. కొత్త రకం పాత్రలు చేసేందుకు రెడీ అవుతున్న ఈ స్టార్ హీరోయిన్ల బోల్డ్ ప్రయోగంపై నెట్టింట చర్చ నడుస్తోంది. septలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని Maddock Films నిర్మిస్తోంది.


