News April 1, 2025
TODAY HEADLINES

✒ మయన్మార్: 2వేలకు చేరిన భూకంప మృతుల సంఖ్య
✒ YCP మంత్రిని బీటెక్ రవి, బీద రవి తన్నారు: లోకేశ్
✒ రేపటి నుంచి మరో ఉచిత సిలిండర్: నాదెండ్ల
✒ అన్యాయాలను ప్రశ్నిస్తే చంపేస్తారా?: YS జగన్
✒ గుండె సమస్య.. ముంబైకి కొడాలి నాని తరలింపు
✒ కాకినాడ పోర్టు నుంచి TG బియ్యం ఎగుమతులు
✒ ‘రాజీవ్ యువ వికాసం’ గడువు APR 14 వరకు పొడిగింపు
✒ SRHకు HCA వేధింపులు.. సీఎం రేవంత్ ఆగ్రహం
✒ HCU భూములపై ముదురుతున్న వివాదం
Similar News
News January 12, 2026
ఇక డాక్టర్ చదువులు అక్కర్లేదట.. ఎందుకో చెప్పిన మస్క్!

ఎంతో కష్టపడి చదివి మనిషి ప్రాణాలను నిలబెట్టే డాక్టర్ కోర్సులు ఇక అవసరం లేదట. వైద్య విద్యలన్నీ ఉపయోగం లేకుండా పోతాయట. ప్రపంచ కుబేరుడు మస్క్ అంచనాలివి. AIలో వస్తున్న మార్పులతో భవిష్యత్తులో రోబోలే క్లిష్టమైన సర్జరీలూ చేస్తాయని చెప్పారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ ఆరోగ్య సంరక్షణ సేవలూ మెరుగవుతాయని తెలిపారు. ఒక దేశాధ్యక్షుడికి అందే వైద్య సౌకర్యాలు సామాన్యుడికీ అందుబాటులోకి వస్తాయన్నారు.
News January 12, 2026
రైతులకు బోనస్ డబ్బులు విడుదల

TG: సంక్రాంతి వేళ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సన్న వడ్లకు రూ.500 కోట్ల బోనస్ నిధులను పౌరసరఫరాల శాఖ విడుదల చేసింది. దీంతో ఈ సీజన్లో ఇప్పటివరకు రూ.1,429 కోట్ల బోనస్ డబ్బులు రిలీజ్ చేసినట్లు పేర్కొంది. కాగా సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 12, 2026
సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

PM మోదీ కొత్త ఆఫీసు సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న అందులోకి ఆయన షిఫ్ట్ కానున్నారు. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ‘సేవా తీర్థ్’ కాంప్లెక్స్ నిర్మించారు. ఇందులో PM ఆఫీస్, క్యాబినెట్ సెక్రటేరియట్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ భవనాలు నిర్మించారు. 1947 నుంచి సౌత్ బ్లాక్లో PMO కొనసాగుతోంది. తరలింపు తర్వాత సౌత్, నార్త్ బ్లాకులను మ్యూజియాలుగా మారుస్తారు.


