News April 1, 2025

నేడు యాదాద్రికి మంత్రి కోమటిరెడ్డి

image

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ ద్వారా ఉదయం 11గం.కు NLG కనగల్ మండలం గంధంవారి ఎడవెల్లి చేరుకొని IKP కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రూ.4కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత ఒంటిగంటకు యాదగిరిగుట్ట చేరుకొని సన్నబియ్యం పంపిణీ, మహిళ సంఘాలకు చెక్కులను పంపిణీ చేస్తారు. 3:30 గంటలకు తిరిగి HYD చేరుకుంటారు.

Similar News

News September 15, 2025

ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపాలి: కలెక్టర్

image

సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. నేడు ఐడీవోసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నుంచి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారంలో జాప్యం చేయొద్దని అధికారులకు తెలిపారు.

News September 15, 2025

రేపు భారీ వర్షాలు

image

ఏపీలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇవాళ తూ.గో., ప.గో., కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

News September 15, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. అలాగే, జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరిగే ‘పోషణ్ మా’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రత్యేక పోషకాహార కార్యక్రమాలు నిర్వహించి, ‘ఎనీమియా ముక్త నిర్మల్’ లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు.