News April 1, 2025
అధికారులకు NTR కలెక్టర్ ఆదేశాలు

ఏప్రిల్ 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2,28,813 మందికి రూ. 98.11 కోట్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. సోమవారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పంపిణీ ప్రారంభమవుతుందని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ జరపాలని సూచించారు.
Similar News
News November 14, 2025
నియోజకవర్గానికో ‘యంగ్ ఇండియా స్కూల్’: Dy.CM

దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని Dy.CM భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విజ్ఞాన దర్శిని నిర్వహించిన సైంటిఫిక్ టెంపరమెంట్ సెలబ్రేషన్స్లో ఆయన పాల్గొన్నారు. నెహ్రూ హయాంలోనే ఐఐటీల స్థాపన, సైన్స్ అభివృద్ధి జరిగిందని కొనియాడారు. రాష్ట్రంలో వైజ్ఞానిక రంగాభివృద్ధికి ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్స్ను స్థాపించడంతో పాటు, IITలను అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు.
News November 14, 2025
రాహుల్, కేటీఆర్ ఐరన్ లెగ్స్: బండి

TG: బిహార్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పని ఖతమైందని, రాహుల్ గాంధీ ఇక పబ్జీ గేమ్కే పరిమితమవుతారని మంత్రి బండి సంజయ్ విమర్శించారు. KTR వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి BRS పతనం కొనసాగుతూనే ఉందన్నారు. దేశంలో రాహుల్, TGలో కేటీఆర్ ఐరన్ లెగ్స్ అని బండి ఎద్దేవా చేశారు. దేశం మొత్తం పోటీ చేస్తామని TRSను BRSగా మార్చిన కేసీఆర్ పత్తా లేకుండా పోయారని, చివరకు ఆ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందన్నారు.
News November 14, 2025
HNK: మెరుగైన సేవలు అందించాలి: DMHO

ఆరోగ్య సమస్యలతో ప్రాథమిక కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఓపికతో వారి సమస్యలను విని అవసరమైన సేవలు అందించాలని DMHO అప్పయ్య అన్నారు. ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అవుట్ పేషెంట్ రిజిస్టర్ని పరిశీలించి ఎంతమంది ఏ విధమైన సమస్యలతో వస్తున్నారని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.


