News April 1, 2025
శ్రీ సత్యసాయి జిల్లా ఫ్యాఫ్టో నూతన కార్యవర్గం ఎన్నిక

ఏపీ ఉపాధ్యాయుల సంఘాల సమైక్య ఫ్యాఫ్టో ఛైర్మన్ కోడూరు శ్రీనివాసులు అధ్యక్షతన సోమవారం అంతర్జాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. జిల్లా ఫ్యాఫ్టో ఛైర్మన్ ఎన్పి కుంటకు చెందిన గజ్జల హరిప్రసాద్ రెడ్డి, సెక్రటరీగా గౌస్ లాజం, కోశాధికారి భాస్కర్ రెడ్డితో పాటు మరో ఆరుగురిని ఎన్నికున్నారు. సభ్యులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Similar News
News November 8, 2025
ఏపీలో 10, 11 తేదీల్లో కేంద్ర బృందాల పర్యటన

AP: మొంథా <<18145441>>తుఫాను<<>> ప్రభావిత జిల్లాల్లో నష్టం అంచనా వేయడానికి 2 కేంద్ర బృందాలు ఈనెల 10, 11 తేదీల్లో పర్యటించనున్నాయి. హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమీ బసు నేతృత్వంలో మొత్తం 8మంది అధికారులు రాష్ట్రానికి రానున్నారు. వీరు 2 టీమ్లుగా విడిపోయి ప్రకాశం, బాపట్ల, ఏలూరు, కృష్ణా, తూ.గో, కోనసీమ జిల్లాల్లో రెండు రోజులు పర్యటిస్తారు. క్షేత్రస్థాయిలో పంట ఇతర నష్టాలను పరిశీలిస్తారు.
News November 8, 2025
కొత్తపల్లి: తండ్రికి తలకొరివి పెట్టిన ముగ్గురు కూతుళ్లు

కొత్తపల్లి గ్రామానికి చెందిన చెప్పులు కుట్టే వృత్తిదారుడు పులి దేవయ్య(65) అనారోగ్యంతో మృతి చెందారు. కుమారులు లేనప్పటికీ, దేవయ్యకు ముగ్గురు కూతుళ్లు సాంప్రదాయాన్ని పక్కనపెట్టి తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు చేశారు. పేదరికంలో ఉన్నప్పటికీ కూతుళ్లకు విద్యనందించి వివాహాలు చేసిన ఆయన ఆదర్శంగా నిలిచారు. దేవయ్య మరణం స్థానికులను విషాదంలో ముంచింది.
News November 8, 2025
2 నెలల్లో 2,717 మందిపై కేసు: SP

సెప్టెంబర్, అక్టోబరులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 2,182 మందిపై కేసులు నమోదు చేసినట్లు బాపట్ల SP ఉమామహేశ్వర్ శనివారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 535 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం 2,717 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు. 4 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 224 ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని 55 వాహనాలకు రూ.1,57,405ల నగదు జరిమానా విధించామన్నారు.


