News April 1, 2025
‘వికారాబాద్ జిల్లాలో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవాలి’

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. యువతను దరఖాస్తులకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
Similar News
News December 26, 2025
మృత్యువుతో పోరాడి వేలమందిని కాపాడిన కామారెడ్డి పోలీసులు!

కామారెడ్డి జిల్లాను ఈ ఏడాది ముంచెత్తిన భారీ వర్షాల్లో పోలీస్ శాఖ మానవత్వాన్ని చాటుకుంది. వరద ఉధృతిలో చిక్కుకున్న 1,251 మందిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. మరో 2,478 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి అండగా నిలిచారు. వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న NH-44 జాతీయ రహదారిపై ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ను పోలీసులు చాకచక్యంగా క్రమబద్ధీకరించారు. అహోరాత్రులు శ్రమించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
News December 26, 2025
సూర్యవంశీకి ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’

క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ(14)కి ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. వీర్ బాల్ దివస్ పేరిట ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ అందుకున్నారు. చిన్న వయసులో కల్చర్, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన వారికి ఈ పురస్కారం ఇస్తారు. ఈ ఏడాది 18 రాష్ట్రాల నుంచి 20 మంది పిల్లలు దీనికి ఎంపికయ్యారు.
News December 26, 2025
సీసీఎంబీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

హైదరాబాద్లోని CCMBలో 9 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు DEC 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BSc, డిప్లొమా, MSc (నేచురల్ సైన్స్), BE, B.Tech, PhD (బయో ఇన్ఫర్మాటిక్స్/జెనిటిక్స్/లైఫ్ సైన్స్, జీనోమిక్స్, మైక్రో బయాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.ccmb.res.in


