News April 1, 2025

ఏప్రిల్ 6న సింహాచలంలో శ్రీరామ నవమి వేడుకలు

image

సింహాచలం కొండపై గంగధార వద్ద ఉన్న సీతారామ స్వామి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఏవో సుబ్బారావు సోమవారం తెలిపారు. ఆరోజు ఉదయం 10:30 నుంచి దేవస్థానం అర్చకుల సమక్షంలో అత్యంత వైభవంగా స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. ఆరోజున భక్తులు విచ్చేసి స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొవాలన్నారు. స్వామి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో సుబ్బారావు తెలిపారు.

Similar News

News April 6, 2025

విశాఖ నుంచి రోడ్డు మార్గంలో అల్లూరి జిల్లాకు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండురోజుల పర్యటన నిమిత్తం సోమవారం విశాఖ రానున్నారు. సోమవారం తెల్లవారి 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన అల్లూరి జిల్లా వెళ్తారు. అక్కడ కొన్ని శంకుస్థాపనలు చేసి అరకులో బస చేస్తారు. మంగళవారం అరకు నుంచి విశాఖ వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం విశాఖలో బస చేయనున్నట్టు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

News April 6, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

విశాఖలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మల్కాపురానికి చెందిన సత్యనారాయణ స్కూటీపై కుమార్తె ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డాక్‌యార్డ్ నుంచి మారుతీ సర్కిల్ మీదుగా వెళుతుండగా కొత్త పెట్రోల్ బంక్ వద్ద స్కూటీని టిప్పర్ ఢీకొట్టడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News April 6, 2025

పోలీస్ సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్‌పై లెర్నింగ్ నిర్వహించిన సీపీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో శనివారం పోలీస్ సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్ పై సీపీ శంఖబ్రత బాగ్చి అవగాహనా కల్పించారు. పలు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో కలిసి అవగాహనా కల్పించారు. ప్రతి పోలీసు కుటుంబానికి మెడికల్ భద్రత అవసరమన్నారు. కంట్రోల్ రూమ్‌లో 24/7 పోలీస్ ఇన్సూరెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సెల్ ద్వారా ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను పోలీస్ ఇన్సూరెన్స్ సెల్ చూసుకుంటుందన్నారు.

error: Content is protected !!