News April 1, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

ఏప్రిల్ 1, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.20 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.29 గంటలకు
ఇష: రాత్రి 7.42 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News April 6, 2025
కరాటే కళ్యాణికి హేమ లీగల్ నోటీసులు

తన పరువుకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు పంపారు. అవాస్తవాలు ప్రచారం చేయడంతోపాటు అసభ్యంగా మాట్లాడారని తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారంటూ హేమపై కేసు నమోదవడంతో MAA ఆమెను సస్పెండ్ చేసింది. తర్వాత టెస్టుల్లో నెగటివ్ రిపోర్టు రావడంతో సస్పెన్షన్ను ఎత్తేసింది. ఇదే విషయంపై కళ్యాణి, హేమకు గతంలో చాలాసార్లు <<13300086>>వాగ్వాదాలు<<>> జరిగిన విషయం తెలిసిందే.
News April 6, 2025
APలో ఎండ తీవ్రత పెరిగే అవకాశం

AP వ్యాప్తంగా క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం(07-04-25) రాయలసీమలో 40-42°C, ఉత్తరాంధ్రలో 39-41°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సుందన్నారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు.
News April 6, 2025
గ్రేట్..అన్నదాతల కోసం 131రోజుల నిరాహార దీక్ష

పంటలకు సరైన మద్దతు ధర ఇవ్వాలని 131 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన రైతు కేంద్రమంత్రుల హామీతో నేడు దీక్ష విరమించారు. పంజాబ్కు చెందిన జగజీత్ సింగ్ దల్లేవాల్ రైతుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ గతేడాది నవంబర్ 26న దీక్ష చేపట్టారు. అతని ఆరోగ్యం విషమించడంతో వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, రైల్వేశాఖ సహాయ మంత్రి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతు దీక్ష విరమించారు.