News April 1, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్‌.. జనగామ జిల్లా మహిళా మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పోలీసు ఎన్కౌంటర్‌లో జనగామ జిల్లాకు చెందిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మృతి చెందారు. కాగా, రేణుకది దేవరుప్పుల మండలం కడవెండి గ్రామం. గ్రామంలో ఆమె మృతిపై తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె మరణాన్ని నిరసిస్తూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News November 8, 2025

ఎటపాక: ఉసురు తీసిన చీటీల అప్పులు

image

అప్పుల బాధతో చీటిల వ్యాపారి గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై అప్పలరాజు తెలిపిన వివరాల మేరకు..ఎటపాకకు చెందిన బాల్యా(60) పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబీకులు భద్రాచలంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. రూ. కోట్లలో అప్పుల పాలవడంతో ఈ సూసైడ్‌కు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు.

News November 8, 2025

హైదరాబాద్ మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌవరం

image

మిథాలి రాజ్.. హైదరాబాదీ మాజీ క్రికెటర్.. మహిళా క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన గొప్ప క్రీడాకారిణి. వివిధ మ్యాచ్‌లో గెలిపించి భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న బ్యాట్స్ ఉమెన్.. ఇప్పడు మిథాలికి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీలో జరిగిన సమావేశంలో మిథాలికి ఐసీసీ ఉమెన్ క్రికెట్ కమిటీలో చోటు కల్పించింది. దీంతో హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 8, 2025

బరువు తగ్గేందుకు విపరీతంగా మందులు వాడేస్తున్నారు.. జాగ్రత్త!

image

ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు చాలామంది భారతీయులు ఓ డయాబెటిస్‌ ఔషధాన్ని వాడుతున్నట్లు తేలింది. దీంతో మన దేశంలో వీటి అమ్మకాలు గత నెలలో ₹100 కోట్ల వరకూ జరిగాయి. అయితే ఈ మందులు తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడానికి జీవనశైలిలో సరైన మార్పులు (పోషకాహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నిర్వహణ) ప్రధానమని సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు వాడాలంటున్నారు.