News April 1, 2025
అమరచింత: రాత్రి వేళైనా కొనసాగుతున్న మున్సిపల్ వసూళ్లు

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ కేంద్రంలో సోమవారం రాత్రి 8 గంటలైనా మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ పన్నును వసూలు చేస్తున్నారు. దీనిపై పలువురు లబ్ధిదారులు పండుగ పూట, రాత్రయినా వసూలు చేస్తున్నారని వాపోయారు. అయినా ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని తెలపడంతో తప్పని పరిస్థితిలో చెల్లిస్తున్నట్లు లబ్ధిదారులు పేర్కొన్నారు.
Similar News
News September 13, 2025
రేగలగడ్డలో భార్యను చంపి, భర్త ఆత్మహత్యాయత్నం

మర్రిపూడిలోని రేగలగడ్డలో దారుణం జరిగింది. నారాయణ భార్య అంజమ్మను శుక్రవారం రాత్రి గొంతుకోసి చంపి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంజమ్మ చనిపోగా.. నారాయణ కొన ఊపిరితో ఉన్నాడు. గ్రామస్థులు సమాచారం పోలీసులకు అందజేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 13, 2025
NGKL: రికార్డ్ వర్షపాతం ఎక్కడ నమోదైందంటే?

నాగర్ కర్నూలు జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా రికార్డు స్థాయిలో పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావు పల్లిలో 117.3 మిమీ వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్ 94.0, లింగాల 61.8, కొండనాగుల 58.5, కోడేరు 44.8, ఐనోల్ 35.5, కోండారెడిపల్లి 32.0, పెద్దకోతపల్లి 23.0, తెలకపల్లి 18.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
News September 13, 2025
ఫేక్ ప్రచారాలకు త్వరలోనే చెక్: మంత్రి అనిత

AP: సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల నియంత్రణకు త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. దీనిపై సీఎం CBN కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నిబంధనల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తోందని చెప్పారు. కొందరు విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారని, ఎక్కడ దాక్కున్నా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టం రాబోతోందని చెప్పారు. SMలో మహిళలపై వ్యక్తిత్వ హననం ఎక్కువవుతోందని వాపోయారు.