News March 26, 2024
చంద్రగిరి: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి
మృతి చెందిన ఘటన తొండవాడ సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఝార్ఖండ్ కు చెందిన రహదేవ్ సింగ్(26) చంద్రగిరిలో కూలీగా పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనంలో వస్తుండగా పెట్రోల్ లేకపోవడంతో ఆగిపోయింది. దీంతో రహదేవ్ సింగ్ పెట్రోల్ పట్టించుకునేందుకు రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News September 28, 2025
చిత్తూరు: ‘రేపు కలెక్టరేట్లో గ్రివెన్స్ డే’

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News September 28, 2025
చిత్తూరు: కాన్పులు చేయలేక చేతులెత్తేశారు.!

జిల్లాలోని 48 PHCలో ఆగస్టులో కేవలం 53 కాన్పులే జరగాయన్న దారుణం శనివారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో వెల్లడైంది. GDనెల్లూరు, శాంతిపురం, రొంపిచర్ల, విజయపురం, పులిచర్ల, కల్లూరు PHCలలో కనీసం ఒక్క కాన్పు కూడా నమోదు కాలేదు. అరకొర వసతులు, సిబ్బంది నిర్లక్ష్యంతో చాలా కేసులు చిత్తూరుకు రెఫర్ అవుతున్నా వాటిలో ఎక్కువగా అంబులెన్స్లలోనే కాన్పులు అవుతున్నట్లు సమాచారం. దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.
News September 28, 2025
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.117 నుంచి 135, మాంసం రూ.170 నుంచి 200 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.193 నుంచి 225 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.195 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.