News April 1, 2025
ఆర్అండ్బీ కార్యాలయం బోర్డులో అంబేడ్కర్ పేరు ఎక్కడ?

కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చి చాలా రోజులు గడుస్తోంది. కానీ కొత్తపేట మండల రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన బోర్డులో కోనసీమ జిల్లా అని మాత్రమే ఉంది. కోనసీమ జిల్లాకు ముందు అంబేడ్కర్ పేరు లేకపోవడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పేరు మార్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 7, 2025
బొబ్బిలి: టీచర్కు రూ.22లక్షల టోకరా.. నిందితుల అరెస్ట్

మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ బొబ్బిలికి చెందిన టీచర్ నుంచి రూ.22 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. చెన్నైకి చెందిన సునీల్ సుతార్, సతీష్, రాజేష్ పాల్, మహ్మద్ ఇర్ఫాన్ను అరెస్ట్ చేసినట్లు SP దామోదర్ గురువారం తెలిపారు. ప్రధాన నిందితుడైన రాజస్థాన్ వాసి వినోద్ చౌదరి పరారీలో ఉన్నాడని చెప్పారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన DSP భవ్యరెడ్డి, CI సతీశ్ కుమార్ను అభినందించారు.
News November 7, 2025
ఎగుమతులే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ సదస్సు

AP నుంచి ఎగుమతులు పెంచడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖలో ‘ఏపీ గ్లోబల్ MSME ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ సమ్మిట్’ నిర్వహించనుంది. బ్రిటన్, రష్యా, ఆస్ట్రియా, జపాన్, హంగేరీ, ఈజిప్ట్, న్యూజిలాండ్, ఉగాండా, జింబాబ్వేతోపాటు 16 దేశాలకు చెందిన 34 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు పాల్గొంటారు. రాష్ట్రంలోని సంస్థలు తయారుచేసే ఉత్పత్తులు, వాటి ఎగుమతుల అవకాశాలను అధికారులు వివరిస్తారు.
News November 7, 2025
స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO

ఇటీవల తుఫాను ధాటికి చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు.


