News April 1, 2025
భూకంప జోన్-3లో భద్రాచలం

భూకంపాలు ఏర్పడే జోన్-3 పరిధిలో భద్రాచలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో తీవ్రత 0.125గ్రావిటీగా ఉంటుందని తెలిపారు. దీంతో భూకంపాలు స్వల్పంగా వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత 56ఏళ్లలో ఈ ప్రాంతంలో 199సార్లు భూకంపాలు వచ్చాయన్నారు. 1969లో పర్ణశాలలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. 2024 DEC 4న కూడా ఇక్కడ భూమి స్వల్పంగా కంపించింది.
Similar News
News November 6, 2025
వరద బాధిత కుటుంబాలకు సాయం ప్రకటించిన కలెక్టర్

కే.వి.బి.పురం మండలంలోని ఒళ్లూరు సమీప రాయల చెరువు తెగిపోవడంతో మూడు గ్రామాలు వరద నీటికి గురయ్యాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.3,000 ఆర్థిక సాయం కల్పించడంతో పాటు బియ్యం 25 కిలోలు, పప్పులు, కూరగాయలు, నూనె, చక్కెర వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. పశు నష్టం వాటిల్లిన రైతులకు ఆవు,గేదెకు రూ.50,000, మేకకు రూ.7,500 పరిహారం అందించబడుతుందని తెలిపారు.
News November 6, 2025
హుజూరాబాద్ ప్రజలతో 25 ఏళ్ల అనుబంధం ఉంది: ఈటల

హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్లో గురువారం బీజేపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకొస్తానని, ఇక్కడి ప్రజలతో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందని పేర్కొన్నారు.
News November 6, 2025
ఉండ్రాజవరం: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో దువ్వాపు జయరాం (25) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి తన ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


