News April 1, 2025

వెల్గటూర్: అనారోగ్యంతో యువకుడి మృతి

image

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన బండారి జన్ పాల్ (19)అనే యువకుడు అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు నెలలుగా జాన్ పాల్ కడుపు నొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 12, 2025

కేయూ: 18 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు.

News November 12, 2025

SBIలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

image

<>SBI<<>> 5కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA/MS/PGDBM/PGDBA ఫైనాన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in

News November 12, 2025

సూర్యాపేట: బయటపడ్డ కాకతీయ కాలం నాటి శివలింగం

image

తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలో 11వ శతాబ్దం నాటి కాకతీయుల కాలం నాటి శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలు బయటపడ్డాయి. అది సోమసూత్ర శివలింగమని గ్రామస్థులు తెలిపారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ శివాలయం పక్కనే అనంతారం గ్రామం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో శివభక్తులు పాల్గొని శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు.