News April 1, 2025
తెనాలి: దైవ దర్శనానికి వెళుతూ అనంత లోకాలకు

కృష్ణా జిల్లా పులిగడ్డ వారిధి వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో తెనాలిలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. చెంచుపేటకు చెందిన రవీంద్ర మోహన బాబు కుటుంబంతో సహా కారులో మోపిదేవి ఆలయానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. 21 రోజుల పసికందుతో సహ రవీంద్ర, అతని భార్య అరుణ, మనుమరాలు(5) ప్రమాదంలో మృతిచెందారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News January 14, 2026
రాజధాని పనులు వేగంగా చేయాలి: కలెక్టర్

రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో రాజధాని ప్రాంత అభివృద్ధి పనుల పై కలెక్టర్ సమీక్షించారు. అభివృద్ధి పనులకు అవసరమైన గ్రావెల్, కంకర, రహదారి మెటీరియల్ తదితర అంశాల్లోఎటువంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.
News January 14, 2026
రాజధాని పనులు వేగంగా చేయాలి: కలెక్టర్

రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో రాజధాని ప్రాంత అభివృద్ధి పనుల పై కలెక్టర్ సమీక్షించారు. అభివృద్ధి పనులకు అవసరమైన గ్రావెల్, కంకర, రహదారి మెటీరియల్ తదితర అంశాల్లోఎటువంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.
News January 13, 2026
తెనాలి: వీడుతున్న హత్య కేసు మిస్టరీ..!

తెనాలి టీచర్స్ కాలనీలో జరిగిన షేక్ ఫయాజ్ అహ్మద్ హత్యకేసు మిస్టరీ వీడుతోంది. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫయాజ్ సహజీవనం చేస్తున్న ఓ మహిళ సహా హత్యకు పాల్పడిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యభిచారం కేసులో పట్టుబడి గతంలో జైలుకు వెళ్లి వచ్చిన మహిళ ముత్యంశెట్టిపాలెంకి చెందిన ఓ వ్యక్తితో కలిసి ఫయాజ్ను హతమార్చినట్లు తెలుస్తోంది.


