News April 1, 2025

ఒత్తిడి వల్ల లంచ్ చేయలేదు: అశ్వనీ కుమార్

image

IPLలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 4 వికెట్లతో సత్తా చాటిన MI బౌలర్ అశ్వనీ కుమార్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తొలి మ్యాచ్ కావడం వల్ల ఒత్తిడితో లంచ్ చేయలేదని, కేవలం అరటి పండు తిన్నట్లు చెప్పారు. మంచి ప్రదర్శన ఇవ్వడానికి తాను కొంత ప్లాన్ చేసుకోగా, జట్టు ఫుల్ సపోర్ట్ ఇచ్చిందన్నారు. షార్ట్‌ లెంగ్త్‌తో పాటు బ్యాటర్ల బాడీని టార్గెట్ చేస్తూ బంతులు వేయాలని కెప్టెన్ హార్దిక్ సూచించారని అశ్వనీ తెలిపారు.

Similar News

News January 23, 2026

టుడే టాప్ స్టోరీస్

image

* ముగిసిన AP, TG సీఎంలు చంద్రబాబు, రేవంత్ దావోస్ పర్యటన
* ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRకు నోటీసులు.. రేపు విచారణ
* రాజధాని నిర్మాణంలో భారీ దోపిడీ: YS జగన్
* తిరిగి రాజకీయాల్లోకి వస్తా: విజయసాయి రెడ్డి
* బ్యాడ్మింటన్‌లో 500 విజయాలు సాధించిన భారత ప్లేయర్‌గా పీవీ సింధు రికార్డ్
* భారత్‌లో T20WC ఆడబోమని ప్రకటించిన బంగ్లాదేశ్
* లాభాల్లో మార్కెట్లు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

News January 23, 2026

టెక్ మహీంద్రా విస్తరణను వేగవంతం చేయండి: లోకేశ్

image

AP: టెక్ మహీంద్రా CEO&MD మోహిత్ జోషీతో మంత్రి లోకేశ్ దావోస్‌లో భేటీ అయ్యారు. VJAలో టెక్ మహీంద్రా IT క్యాంపస్, విశాఖ విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. AI & ML, క్లౌడ్ IOT, సైబర్ సెక్యూరిటీ, ఇండస్ట్రీ 4.0 కోసం స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని సూచించారు. అటు టెక్నాలజీ, డిజిటల్, కన్సల్టింగ్ సేవల్లో ప్రసిద్ధి చెందిన యాక్సెంచర్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ&సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మతోనూ లోకేశ్ చర్చించారు.

News January 23, 2026

WPL: యూపీపై గుజరాత్ విజయం

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌పై గుజరాత్ 45 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 153/8 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ 108 రన్స్‌కే కుప్పకూలింది. GG బౌలర్లలో రాజేశ్వరి 3, రేణుక, సోఫీ చెరో 2, కేశ్వీ, గార్డ్‌నర్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో యూపీ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.