News April 1, 2025
మహిళపై గ్యాంగ్ రేప్.. సంచలన విషయాలు

TG: నాగర్ కర్నూల్ జిల్లాలో <<15944914>>మహిళపై గ్యాంగ్ రేప్<<>> ఘటనలో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఏడుగురు ఈ దారుణానికి ఒడిగట్టగా, దాదాపు 3 గంటలపాటు ఆమెను లైంగికంగా వేధించినట్లు చెప్పారు. దాహం వేస్తోందని బాధితురాలు మంచినీరు అడగగా మానవత్వం మరిచి నోట్లో మూత్రం పోసినట్లు తెలిపారు. కాగా నిన్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వీరికి సహకరించిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Similar News
News April 6, 2025
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు GOOD NEWS

AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అలాగే ఉన్నత చదువులు కలిగిన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పారు. ఖాళీలు ఎక్కువగా ఉండటంతో మిగిలిన ఉద్యోగులపై భారం పడుతోందని, దీన్ని తగ్గించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
News April 6, 2025
‘CID’ ACP ప్రద్యుమన్ పాత్ర ముగింపు.. షాక్లో ఫ్యాన్స్

ఫేమస్ హిందీ టీవీ షో ‘సీఐడీ’ తెలుగులోనూ చాలామందికి సుపరిచితమే. ఇందులో ప్రధాన పాత్రధారి ఏసీపీ ప్రద్యుమన్ మృతిచెందారని సోనీ టీవీ ట్వీట్ చేసింది. ఆ పోస్ట్ చూసిన చాలామంది పాత్ర పోషించిన శివాజీ సాటమ్ చనిపోయారనుకుని పొరబడ్డారు. షో హిట్ అవ్వడానికి ప్రధాన కారణమైన శివాజీని ఎందుకు తొలగించారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓ ప్రముఖ నటుడు కొత్త ఏసీపీగా నటించనున్నట్లు సమాచారం.
News April 6, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల చికెన్ ధరలు తగ్గాయి. హైదరాబాద్ నగరంలో గత వారం స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.280 ఉండగా నేడు రూ.230గా ఉంది. విజయవాడలో కేజీ రూ.310 నుంచి రూ.270కి తగ్గింది. బర్డ్ ఫ్లూతో ఏపీలో ఓ చిన్నారి మృతి చెందిందన్న వార్తల ప్రభావం ధరలపై చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా చాలా మంది నాన్-వెజ్ తినేందుకు ఇష్టపడట్లేదు.