News April 1, 2025
సత్యసాయి జిల్లాలో చిరుత పులి కలకలం

సత్యసాయి జిల్లాలో చిరుత పులి కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే .. గోరంట్ల మండలం ఎముకలగుట్టపల్లిలో సోమవారం రాత్రి పాడి ఆవుపై చిరుతపులి దాడి చేసింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 9, 2025
MNCL: అండర్-14 క్రికెట్ బాలుర జిల్లా స్థాయి ఎంపిక పోటీలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాలలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో అండర్-14 క్రికెట్ బాలుర జిల్లా స్థాయి ఎంపిక పోటీలు జరిగాయి. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని జోనల్ స్థాయికి ఎంపిక చేయనున్నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎండీ యాకుబ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోటీల కన్వీనర్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
News November 9, 2025
GWL: ఆర్డీఎస్ను పటిష్ఠం చేయాలి..!

టీబీ డ్యామ్ ద్వారా అలంపూర్ నియోజకవర్గానికి సాగునీరు అందించే (రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) ఆర్డీఎస్ ఆనకట్టను పటిష్ఠ పరచాలని అలంపూర్ రైతులు అంటున్నారు. చాలా కాలం క్రితం నిర్మించిన ఆనకట్ట బకెట్ వ్యవస్థ దెబ్బతింది. భారీ వరదకు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. బకెట్ వ్యవస్థ పటిష్ఠతకు గతంలో పనులు ప్రారంభించినా పూర్తి చేయలేదు. ఈ ఏడాది వేసవి కాలంలో బకెట్ వ్యవస్థను పటిష్ఠం చేయాలని రైతులు ప్రభుత్వాలను కోరుతున్నారు.
News November 9, 2025
ఘట్టమనేని జయకృష్ణ మూవీ ప్రారంభం

దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆయన మనవడు ఘట్టమనేని జయకృష్ణ(రమేశ్ బాబు కుమారుడు) ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. #AB4 వర్కింగ్ టైటిల్తో అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. గొప్ప ప్రేమ కథతో ఈ సినిమా రూపొందనుందని డైరెక్టర్ తెలిపారు.


