News March 26, 2024
3-6 లక్షల మెజార్టీతో గెలిచినా ఈసారి సీటు దక్కలేదు

లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. సామాజిక సమీకరణాలతోపాటు పార్టీకి చేటు తెచ్చేలా మాట్లాడిన వారిపై వేటు వేసింది. గత ఎన్నికల్లో 3 లక్షల నుంచి 6 లక్షల మెజార్టీతో గెలిచిన 39 మందిని పక్కనపెట్టింది. వారిలో సంజయ్ భాటియా(కర్నాల్), రంజనాబెన్(వడోదరా), పర్వేష్(పశ్చిమ ఢిల్లీ), హన్స్రాజ్(వాయవ్య ఢిల్లీ), అనంత కుమార్(ఉత్తర కన్నడ) ఉన్నారు.
Similar News
News February 7, 2026
అన్నమయ్య: వేలాది కోళ్ల మృతి.. కారణం ఇదే..!

ఉమ్మడి చిత్తూరు జిల్లా సదుం మండలంలో వేలాది నాటు కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ ఉమాదేవి, జిల్లా అధికారులు శుక్రవారం పరిశీలించారు. వీటి నమూనాలను భోపాల్ ల్యాబ్ పంపించామని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. ప్రస్తుతం తమకున్న నివేదిక ప్రకారం దీనిని కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నామన్నారు.
News February 7, 2026
వాకింగ్కి టైమ్ లేదా? ఈ చిన్న పనులతో గుండె ఆరోగ్యం

✦ జిమ్/లాంగ్ వాక్కు టైమ్ లేకపోయినా VILPA (విగరస్ ఇంటర్మిటెంట్ లైఫ్స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
✦ లిఫ్ట్/ఎస్కలేటర్కు బదులు మెట్లు ఎక్కడం, వేగంగా నడవడం మంచిది.
✦ ఇంటి పనులు చేయడం, గ్రాసరీస్ మోయడం, పిల్లలతో ఆడుకోవడమూ యాక్టివిటీనే.
✦ ఎక్కువసేపు కూర్చోకుండా 30నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిరగాలి.
✦ డాన్స్, వంట చేస్తూ ఫుట్ ట్యాప్ చేయడం కూడా ఎక్సర్సైజ్ చేసినట్టే.
News February 7, 2026
దివ్యాంగులకు వెసులుబాటు కల్పించిన UPSC

సివిల్స్ ఎగ్జామ్స్ రాసే దివ్యాంగుల(Pwbd)కు పరీక్షా కేంద్రం ఎంపికలో <<19061199>>UPSC<<>> వెసులుబాటు కల్పించింది. అభ్యర్థులు కోరుకున్న కేంద్రాన్ని కేటాయించనున్నట్లు పేర్కొంది. గరిష్ఠ సామర్థ్యం(ఫుల్ స్ట్రెంత్) చేరుకున్నప్పటికీ దివ్యాంగ అభ్యర్థులకు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనుంది. అవసరమైన చోట పరీక్షా కేంద్రం సామర్థ్యాన్ని పెంచుతామని UPSC తెలిపింది. అయితే ఇది ఇతరులకు వర్తించదని స్పష్టం చేసింది.


