News April 1, 2025
SBI వినియోగదారులకు అలర్ట్

కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమవుతుండటంతో SBI కీలక ప్రకటన విడుదల చేసింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటలకు వరకు డిజిటల్ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. చెల్లింపుల్లో అంతరాయం లేకుండా ఉండేందుకు UPI LITE, ATMను వినియోగించాలని సూచించింది. వినియోగదారుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది.
Similar News
News April 6, 2025
ఎకనామిక్ గ్రోత్ రేట్.. రెండో స్థానంలో AP: మంత్రి లోకేశ్

ఎకనామిక్ గ్రోత్ రేట్(2024-25)లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచిందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కేంద్రం విడుదల చేసిన నివేదికను పంచుకున్నారు. AP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GSDP) ₹8.73 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. 9.69% గ్రోత్ రేటుతో TN తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో AP (8.21%), అస్సాం (7.94), రాజస్థాన్ (7.82), హరియాణా(7.55), ఛత్తీస్గఢ్ (7.51), TG (6.69) ఉన్నాయి.
News April 6, 2025
సినిమాల్లోకి సీనియర్ హీరోయిన్ కూతురు?

సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణమైపోయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న సీనియర్ హీరోయిన్ కుష్బూ, దర్శకుడు సుందర్ల కూతురు అవంతిక తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా అవంతిక సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కొత్త హీరోయిన్ వచ్చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నటించాలని తన మనసులో ఉందని, ఎప్పుడూ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదని గతంలో అవంతిక చెప్పారు.
News April 6, 2025
శ్రీరామనవమి.. కొన్ని ప్రశ్నలు

రామాయణం గురించి మీకు కొన్ని ప్రశ్నలు. జవాబులు కామెంట్ చేయండి.
1.రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
2.లక్ష్మణుని భార్య ఊర్మిళ తండ్రి ఎవరు?
3.రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో కవలలు ఎవరు?
4.గంగను భూమికి తీసుకొచ్చేందుకు ఎవరు తపస్సు చేశారు?
5.శివధనుస్సును ఎవరు తయారుచేశారు?
6.సీతను అపహరించేందుకు రావణుడు ఎవరి సాయం కోరాడు?
7.రావణుడిని వధించేందుకు రాముడికి ఎవరు రథం పంపారు?