News March 26, 2024

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత

image

ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు గత ఏడాది కంటే ఈ సారి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గత పది రోజులుగా జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగాల్పులు వీస్తున్నాయి. ఈ కారణంగా మధ్యాహ్న సమయంలో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోత కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News March 10, 2026

గంజాయి సేవిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి: SP శరత్ చంద్ర

image

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ స్థాయిలో రహదారి భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకొని రోడ్డు ప్రమాదాల విషయాలపై చర్చించాలని ఎస్పీ శరత్ చంద్ర పవర్ సూచించారు. నకిరేకల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించి సమాచారం తెలిస్తే తక్షణమే 8712670266 నంబర్‌కి ఫోన్ చేసి తెలియజేయాలని, గత సంవత్సరం జిల్లాలో 53 గంజాయి కేసులు నమోదు చేశామని తెలిపారు.

News March 10, 2026

రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి: ఎస్పీ శరత్ చంద్ర

image

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన ‘సురక్షితంగా చేరుకోండి’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 2024లో 400గా ఉన్న ప్రమాదాల సంఖ్యను 2025 నాటికి 360కి తగ్గించామన్నారు. మరణించిన వారిలో 50 శాతం ద్విచక్ర వాహనదారులేనని, హెల్మెట్ లేకపోవడం వల్లే 90 శాతం ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

News March 10, 2026

అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

image

అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నకిరేకల్‌లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా ఈ ప్రణాళికను రూపొందించామని, దీని విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.