News April 1, 2025
సింగరేణి ఆర్థికంగా ముందుకెళ్లాలి: శ్రీరాంపూర్ జీఎం

సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత ముందుకు సాగాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. జీఎం కార్యాలయంలోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా లక్ష్మిపూజ నిర్వహించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులందరిపైనా ఉండాలని కోరారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెరగాలని కోరారు.
Similar News
News September 16, 2025
సిరిసిల్ల: ‘SIR కట్టుదిట్టంగా నిర్వహించాలి’

ఓటర్ జాబితా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కట్టుదిట్టంగా నిర్వహించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్లో SIR పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2002 సం. తర్వాత కొత్తగా ఓటర్ నమోదు చేసుకున్న ప్రతి ఓటర్ వివరాలు క్షేత్రస్థాయిలో వెరిఫై చేయాలన్నారు. 40ఇయర్స్ కంటే ఎక్కువ వయసున్న ఓటర్ల జాబితా వెరిఫై చేయాల్సిన అవసరం ఉండదన్నారు.
News September 16, 2025
మెదక్: ‘పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి’

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డికి 2003 ఉద్యోగ, ఉపాధ్యాయ పాత పెన్షన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా, ఇటీవల రాష్ట్ర హై కోర్టు 2003 ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తు 3 నెలలో అమలు చేయాలని స్పష్టంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. మాడవేడి వినోద్ కుమార్, ఇమ్మడి సంతోశ్ కుమార్ తదితరులున్నారు.
News September 16, 2025
నెల్లూరు: జాడ తెలియని బై జ్యూస్ ట్యాబ్లు

2022-23, 2023-24లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు (20,830) ఉపాధ్యాయులకు (3,554) గత YCP ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్లు ఇచ్చింది. బైజూస్తో ఒప్పందం కుదుర్చి కొంతమంది సబ్జెక్టులు అప్లోడ్ చేశారు. పాఠ్యాంశాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో డిజిటల్ బోధన ప్రభావం చూపలేదు. కొన్నాళ్లకే ట్యాబ్లు పనిచేయక విద్యార్థులు పక్కన పెట్టారు. కొందరు గేమ్స్, వినోదం కోసం వాడేశారు. ప్రస్తుతం ఆ ట్యాబ్లు ఎక్కడున్నాయో స్పష్టత లేదు.