News April 1, 2025
అనకాపల్లి జిల్లాలో 157 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షకు 157 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 20,679 మంది హాజరైనట్లు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 256 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 194 మంది హాజరైనట్లు తెలిపారు.
Similar News
News September 14, 2025
కేజీ చికెన్ ధర రూ.280.. ఎక్కడంటే?

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. TGలోని హైదరాబాద్, కామారెడ్డి, ఖమ్మంతో పాటు APలోని విజయవాడ, గుంటూరు, నంద్యాల, పల్నాడు, తూ.గో తదితర నగరాల్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.230-240కి విక్రయిస్తున్నారు. అత్యధికంగా తిరుపతిలో రూ.280, అత్యల్పంగా కాకినాడలో రూ.220-230గా ఉంది. మీ ఏరియాలో రేట్ ఎంత? COMMENT
News September 14, 2025
VJA: లేపాక్షి ప్రదర్శనలో విద్యార్థుల సరికొత్త ఆలోచనలు

విజయవాడలోని లేపాక్షి హస్తకళల డిజైన్ పోటీ, మాస్టర్ పీసెస్ ఎగ్జిబిషన్లో యువ డిజైనర్ల ఆలోచనలు ప్రతిధ్వనించాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది విద్యార్థులు సాంప్రదాయ హస్తకళలను లోతుగా అధ్యయనం చేశారు. టెక్స్టైల్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్ వంటి విభాగాల్లో విద్యార్థులు ప్రదర్శనలోని కళాఖండాలను పరిశీలించి, డిజైన్, నాణ్యత, వినియోగం, ప్రజెంటేషన్ అంశాలపై విశ్లేషణ చేశారు.
News September 14, 2025
VJA: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం అప్డేట్

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరువురు వ్యక్తులు దుర్మరణం చెందినట్లు గూడూరు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తులు విజయవాడ శివారు తాడిగడపకు చెందిన ఆదాం బాబు, షరీన్గా పోలీసులు గుర్తించారు. వీరు ద్విచక్ర వాహనంపై మచిలీపట్నం బీచ్కి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెప్పారు.