News April 2, 2025

తిరుతి జిల్లాలో ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. జిల్లాలో 164 కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 26,967 మందికి 26, 615 మంది పరీక్షలు రాశారు. ప్రైవేట్ విద్యార్థులు 127 మందికి గాను 41 మంది రాకపోవడంతో 86 మంది పరీక్షలు రాశారని డీఈవో కుమార్ తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు పూర్తి చేశారు.

Similar News

News November 7, 2025

తండ్రులకూ డిప్రెషన్.. వారికీ చేయూత కావాలి!

image

బిడ్డ పుట్టాక తల్లుల్లో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వల్ల ఒత్తిడి, చిరాకు, కోపం వంటివి వస్తాయి. ఇప్పుడు బిడ్డను చూసుకునే బాధ్యత తండ్రికీ ఉంటోంది. రాత్రులు నిద్రలేకపోవడం, బాధ్యతలు, ఖర్చులు, ఒత్తిడి, జాబ్ కారణంగా తండ్రుల్లోనూ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి సూసైడ్ థాట్స్ కూడా వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తండ్రికీ కుటుంబం నుంచి చేయూత అవసరం అంటున్నారు.

News November 7, 2025

డిసెంబర్‌లో పెళ్లి.. అంతలోనే..!

image

డిసెంబర్‌లో పెళ్లి జరగాల్సిన ఓ ఇంట్లో విషాదం నెలకొంది. రాబోయే కొత్త జీవితం కోసం కలలు కన్న రామును కోల్పోవడం కుటుంబానికి తట్టుకోలేని విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపప్పూరు(M) చాగల్లులో గ్రామానికి చెందిన రాము(23) గురువారం టెంకాయ చెట్టును కొడుతుండగా విద్యుత్తు వైర్లు తగిలి షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

News November 7, 2025

అజిత్ సినిమాలో విజయ్ సేతుపతి, లారెన్స్!

image

హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌‍లో AK 64 మూవీతో బిజీగా ఉన్నారు. సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు జనవరిలో ప్రకటిస్తామన్నారు. దీనిని పాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే కోలీవుడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, లారెన్స్ కీలక పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని సమాచారం.