News April 2, 2025

అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తాం: ASF కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం రేషన్ కార్డుదారులకు అందిస్తామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌లతో కలిసి అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి సూచనలు చేశారు.

Similar News

News September 18, 2025

సీఎంతో డీఎస్సీ అభ్యర్థుల సమావేశం వాయిదా: డీఈవో

image

వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో శుక్రవారం అమరావతిలో జరగాల్సిన డీఎస్సీ ఉపాధ్యాయుల సమావేశం వాయిదా పడినట్లు డీఈఓ షేక్ సలీం బాషా తెలిపారు. జిల్లా కలెక్టర్ నుంచి ఈ సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎంఈఓలు డీఎస్సీ అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. తదుపరి సమావేశం తేదీని ఇంకా నిర్ణయించలేదని, డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 18, 2025

వైట్ హెడ్స్ ఇలా తొలగిద్దాం..

image

కొందరికి చర్మంపై చిన్నగా తెల్లని మచ్చలు ఉంటాయి. అవే వైట్ హెడ్స్. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి. * కాస్త ఓట్స్ పొడిలో నీళ్లు కలిపి మెత్తని ముద్దలా చేసి సమస్య ఉన్న చోట రాయాలి.15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. * చెంచా వంటసోడాలో నీళ్లు కలిపి వైట్‌హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఆ వంట సోడా పూత ఆరిపోయాక కడిగెయ్యాలి. ఇలా తరచూ చేస్తోంటే వైట్ హెడ్స్‌తోపాటు అధిక జిడ్డు సమస్య కూడా తగ్గుతుంది.

News September 18, 2025

VJA: దుర్గా మల్లేశ్వరస్వామి హుండీ ఆదాయ వివరాలు

image

ఇంద్రకీలాద్రిపై గత 14 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.2,17,98,528 నగదు, 235 గ్రా. బంగారం, 1.39 కి.గ్రా. వెండి హుండీ కానుకలుగా వచ్చాయని EO శీనా నాయక్ తెలిపారు. 321 US డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 25 UAE దిర్హమ్స్, 25 సౌదీ రియల్స్, 200 ఒమన్ బైసా కరెన్సీతో పాటు 7 ఇతర దేశాల విదేశీ కరెన్సీ ఇంద్రకీలాద్రిపై ఉన్న 48 హుండీలలో కానుకలుగా వచ్చాయన్నారు.