News April 2, 2025

KMR: కిసాన్ సెల్ రాష్ట్ర కమిటీ సమావేశం

image

కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల సమావేశం మంగళవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. కిసాన్ న్యాయ యోధ మెంబర్షిప్‌ లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లాకు చెందిన జాతీయ నేషనల్ కిసాన్ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ నీలం రమేశ్ ఉన్నారు.

Similar News

News January 14, 2026

KNR జిల్లా ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడిగా నవీన్‌కుమార్ గౌడ్

image

కరీంనగర్ జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడిగా సైదాపూర్ ఉప సర్పంచ్ గోపగోని నవీన్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఉప సర్పంచ్ల సమావేశంలో ఎన్నిక నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా నామని విజేందర్, ఉపాధ్యక్షులుగా దొంతరవేనా రమేష్, గుండారపు మహేష్, కట్కమ్ మనీష్, సంయుక్త కార్యదర్శులుగా మిడిదొడ్డి సుధాకర్, జక్కుల అనిల్, అధికార ప్రతినిధిగా మేకల మహేష్‌ను ఎన్నుకున్నారు.

News January 14, 2026

తాడిపత్రిలో పందుల పోటీలు

image

రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు అంబరాన్ని తాకుతున్న వేళ అనంతపురం జిల్లాలో వినూత్నంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఎక్కడైనా కోడి పందేలు, రాతిదూలం లాగుడు పోటీలు, బల ప్రదర్శన పోటీలు చూశాం. కానీ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న రీతిలో పందుల పోటీలను జూనియర్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించారు. తాడిపత్రి వాసులు మాత్రం ఈ పోటీలను జేసీ 10 ఏళ్ల కిందటే నిర్వహించారని హర్షం చేశారు.

News January 14, 2026

BREAKING: భారత్ ఓటమి

image

టీమ్ ఇండియాతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 285 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 47.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మిచెల్ సెంచరీ (131*)తో చెలరేగి తమ జట్టుకు విజయాన్ని అందించారు. యంగ్ 87 పరుగులతో రాణించారు. మూడో వన్డే జనవరి 18న ఇండోర్‌లో జరగనుంది.