News April 2, 2025
147శాతం బొగ్గు ఉత్పత్తి చేశాం: శ్రీరాంపూర్ జీఎం

2025- 26 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు, అధికారుల సమిష్టి కృషితో శ్రీరాంపూర్ ఏరియాకు నిర్దేశించిన 65.16 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి నెలలో ఏరియాలోని గనులు రికార్డు స్థాయిలో 147 శాతం ఉత్పత్తి సాధించాయని పేర్కొన్నారు. 28, 31 తేదీల్లో 10 రేకుల బొగ్గు రవాణా చేసినట్లు వెల్లడించారు.
Similar News
News March 22, 2026
త్వరలో యాదాద్రికి MMTS

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు త్వరలో రైల్వే శాఖ తీపి కబురు అందించనుంది. వచ్చే నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా MMTS రెండో దశ పనులకు అంకురార్పణ జరగనుంది. సుమారు రూ.430 కోట్ల వ్యయంతో ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 33KM మేర కొత్త లైన్ నిర్మించి, రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక భక్తులు అతి తక్కువ ఖర్చుతో నేరుగా క్షేత్రానికి చేరుకోవచ్చు.
News March 22, 2026
HYD: ముంచుకొస్తోంది.. జర జాగ్రత్త!

వేసవి దృష్ట్యా HYDలో ఒక్కపూట బడులు సాగుతున్నాయి. ఈ గ్యాప్లో పిల్లలు సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఈసరదా వెంటే విషాదం పొంచి ఉండే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాదీలు గతేడాది 8 మంది లోతు తెలియక, ప్రవాహ తాకిడికి మునిగిపోయారు. వేసవిలో రోజుకు నలుగురి చొప్పున ఈత సరదాకు బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. పెద్దలు, నిపుణుల సమక్షంలో పిల్లలకు ఈత నేర్పండి.
News March 22, 2026
NZB: మండే ఎండలు.. జాగ్రత సుమా..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మెండోరా, మోస్రా 38.7°C, బాల్కొండ 38.4, మాచర్ల 38.2, భీమగల్ 38, తొండకూరు 37.5, మోర్తాడ్ 37.4, వేంపల్లె 37, మాగిడి, ఎడపల్లి నిజామాబాద్(సౌత్), కొల్లూరు(బాన్సువాడ) 36.7, పెర్కిట్, ఎర్గట్ల 36.6, ఆలూరు, బీబీపేట 36.5°C ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలకు జాగ్రత్తలు అవసరమని పేర్కొన్నారు


