News April 2, 2025

జనగామ: సన్నం బియ్యం పంపిణీకి విస్తృత చర్యలు: కలెక్టర్

image

జనగామ జిల్లాలో సన్నబియ్యం పంపిణీకి విస్తృత చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టి ప్రారంభించడంతో జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో MLA యశస్విని రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో 1,61,264 రేషన్ కార్డులకు గాను నిత్యవసర దుకాణాల ద్వారా 3151.228 మెట్టు టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News January 17, 2026

మొక్కజొన్నలో బొగ్గు కుళ్లు తెగులు – నివారణ

image

బొగ్గు కుళ్లు తెగులు ఎక్కువగా సోకే ప్రాంతాల్లో పంటవేసే ముందు పచ్చిరొట్ట పైరును సాగుచేసి నేలలో కలియదున్నాలి. ఎకరాకు అదనంగా 30 కిలోల పొటాష్‌ను ఇచ్చే ఎరువులను వేయాలి. ఎండాకాలంలో నేలను లోతుగా దున్నాలి. పంట వేసిన తర్వాత ముఖ్యంగా పూతదశ నుంచి నేలలో తేమ తగ్గకుండా నీటి తడులు పెట్టాలి. పంటకోసిన తర్వాత తెగులు సోకిన మొక్కల భాగాలను ఏరి కాల్చివేయాలి. పంటమార్పిడి పద్ధతిని అనుసరించాలి.

News January 17, 2026

మనోవాంఛలు నెరవేర్చే మహా దుర్గా మంత్రం

image

‘‘ఓం క్లీం శ్రీం యాదేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః క్లీం శ్రీం ఓం’’
పఠన ఫలితం: ఈ శక్తిమంతమైన మంత్రాన్ని సాధన చేయడం వల్ల ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా తొలగిపోయి, సాధకుడికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సకల బాధలు, కష్టాలు నివారణ అవుతాయి. శత్రు బాధలు నశించి, మనోవాంఛలు నెరవేరుతాయి. ఈ మంత్రాన్ని భక్తితో పఠించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం అతి త్వరగా లభిస్తుంది.

News January 17, 2026

భద్రాద్రి: నేడే రిజర్వేషన్లు.. సర్వత్రా ఉత్కంఠ

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం అధికారులు పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. కాగా ఈరోజు ఉదయం 11 గంటలకు భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో మునిసిపల్, కార్పొరేషన్ వార్డు/డివిజన్ల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రిజర్వేషన్లపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.