News April 2, 2025
శ్రీశైల మల్లన్నకు రూ.6.10కోట్ల ఆదాయం

AP: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం 27 రోజులకు గానూ రూ.6.10కోట్లు వచ్చినట్లు దేవాలయ అధికారులు తెలిపారు. దీంతో పాటు 20.1 తులాల బంగారం, 6.2 కిలోల వెండిని భక్తులు సమర్పించినట్లు చెప్పారు. అదే విధంగా 990 యూఎస్ డాలర్లు, ఇతర దేశాల కరెన్సీ కూడా హుండీలో వేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఉగాది వేడుకల సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే.
Similar News
News April 6, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల చికెన్ ధరలు తగ్గాయి. హైదరాబాద్ నగరంలో గత వారం స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.280 ఉండగా నేడు రూ.230గా ఉంది. విజయవాడలో కేజీ రూ.310 నుంచి రూ.270కి తగ్గింది. బర్డ్ ఫ్లూతో ఏపీలో ఓ చిన్నారి మృతి చెందిందన్న వార్తల ప్రభావం ధరలపై చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా చాలా మంది నాన్-వెజ్ తినేందుకు ఇష్టపడట్లేదు.
News April 6, 2025
కాంగ్రెస్ ఉదారత వల్లే ఈ పరిస్థితి: కంగనా రనౌత్

వక్ఫ్ బోర్డుల్లో నిబంధనల ఉల్లంఘనకు కాంగ్రెస్ ఉదారతే కారణమని నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విమర్శించారు. భారీ స్థాయిలో జరిగిన భూకబ్జాలకు వక్ఫ్ సవరణ బిల్లు పరిష్కారం చూపుతుందన్నారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచే వక్ఫ్ బోర్డుల ఏర్పాటులో భారీ కుట్ర ఉందని ఆరోపించారు. దాంతో ఇప్పటికీ దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ఏ ఒక్క వ్యక్తి, కమ్యూనిటీ లేదా సంస్థ చట్టం కంటే ఎక్కువ కాదని పేర్కొన్నారు.
News April 6, 2025
చెన్నై చెత్త రికార్డు

IPL: చెన్నై చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ సీజన్లో 5 నెమ్మదైన హాఫ్ సెంచరీల్లో 3 CSK ఆటగాళ్లవే కావడం గమనార్హం. విజయ్ శంకర్ 43, రచిన్ 42, జైస్వాల్ 40, లివింగ్స్టోన్ 39, గైక్వాడ్ 37 బంతుల్లో అర్ధసెంచరీలు చేశారు. అటు నిన్న ధోనీ క్రీజులోకి వచ్చిన 19 బంతుల తర్వాత బౌండరీ బాదారు. మ్యాచులు ఓడిపోవడం సహజం అని, అయితే చెన్నై బ్యాటర్లలో గెలవాలన్న కసి కనిపించట్లేదని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.