News April 2, 2025
పర్చూరులో విషాదం.. యువకుడు మృతి

బాపట్ల జిల్లా పర్చూరు పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరుగురు స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్ళాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేతికి అందొచ్చిన కొడుకు చనిపోవడంతో వంశీ తల్లిదండ్రులు బోరున విలపించారు.
Similar News
News February 9, 2026
మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల కేంద్రంగా జరగాల్సిన డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు కోఆర్డినేటర్ వీరన్న తెలిపారు. ఎన్నికల విధుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
News February 9, 2026
T20WCలో నేడు..

T20 ప్రపంచకప్లో భాగంగా ఇవాళ కోల్కతా, కొలంబో, అహ్మదాబాద్ వేదికగా 3 మ్యాచ్లు జరగనున్నాయి.
* ఉ.11 నుంచి.. స్కాట్లాండ్vsఇటలీ
* మ.3 నుంచి.. జింబాబ్వేvsఒమన్
* రా.7 నుంచి.. దక్షిణాఫ్రికాvsకెనడా
LIVE: స్టార్స్పోర్ట్స్, జియో హాట్స్టార్
News February 9, 2026
KMR: పుర పోరుతో దొరికిన ఉపాధి

కామారెడ్డి జిల్లాలో ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల పర్వం పలువురు వ్యక్తులకు ఉపాధిని కల్పించింది. పోటాపోటీగా కార్యకర్తలను సమకూర్చేందుకు ఒక్కొక్కరికి రూ.200 నుంచి 400వరకు, భోజనం ఫ్రీ, ప్రచార కరపత్రాల, ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ లకు, ప్రచార వాహనాల యజమానులకు, టిఫిన్ సెంటర్ లు, వంటలవారికి, పాటల మిక్సింగ్, మ్యూజిక్, టెంట్ హౌస్ ఇలా ప్రతి ఒక్కరికి నామినేషన్ల నుంచి పోలింగ్ పూర్తయ్యేవరకు ఉపాధి లభించింది.


