News April 2, 2025
అనకాపల్లి జిల్లాలో 94.87 పెన్షన్ల పంపిణీ పూర్తి

అనకాపల్లి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద మంగళవారం 94.87 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,56,072 మందికి పెన్షన్ పంపిణీకి రూ.108 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 2,43,580 మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందజేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 5వ తేదీ వరకు పంపిణీకి అవకాశం ఉందన్నారు.
Similar News
News January 11, 2026
కృష్ణా: కోడి పందేలలో గోదావరి జిల్లాలను తలదన్నేలా.?

సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందేలు.. కోడి పందేలు అంటేనే గోదావరి జిల్లాలు. అయితే గత కొన్నేళ్లు గోదావరి జిల్లాలను తలదన్నే విధంగా కృష్ణా జిల్లాలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో కోడి పందేలు వేసేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లు, గన్నవరం మండలం అంబాపురం, గుడ్లవల్లేరు మండలం వేమవరం వద్ద అతిపెద్ద బరులను ఏర్పాటు చేస్తున్నారు.
News January 11, 2026
సంక్రాంతి ఎఫెక్ట్.. గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి – అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ట్రైన్ నంబర్ 07477/07478 చర్లపల్లి నుంచి అనకాపల్లికి, తిరుగు ప్రయాణంలో అనకాపల్లి నుంచి చర్లపల్లికి నడవనున్నాయి. ఈ రైళ్లు గుంటూరు మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ట్రైన్ నంబర్ 07479 అనకాపల్లి నుంచి చర్లపల్లికి మరుసటి రోజు అందుబాటులో ఉంటుందని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
News January 11, 2026
సైబర్ క్రైమ్ ముఠా ఉచ్చు నుంచి బయటపడ్డ ఉత్తరాంధ్ర యువకులు

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన 27 మంది యువకులు మయన్మార్లో సైబర్ క్రైమ్ ముఠాకు చిక్కుకొని నరకయాతన పడ్డారు. యువకులు ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడి తిరిగి మన దేశానికి తీసుకొచ్చారు. ఆదివారం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న యువకులు మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


