News April 2, 2025
అనకాపల్లి జిల్లాలో 94.87 పెన్షన్ల పంపిణీ పూర్తి

అనకాపల్లి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద మంగళవారం 94.87 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,56,072 మందికి పెన్షన్ పంపిణీకి రూ.108 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 2,43,580 మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందజేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 5వ తేదీ వరకు పంపిణీకి అవకాశం ఉందన్నారు.
Similar News
News September 17, 2025
కావలిలో SI ఇంటి ముందు మహిళ ఆందోళన

కావలిలోని ముసునూరులో SI వెంకట్రావు ఇంటిముందు మంగళవారం రాత్రి ఓ మహిళ ఆందోళనకు దిగింది. గతంలో ఎస్ఐ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసులు ఎస్ఐ వెంకట్రావుపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నగదు ఇచ్చేలా ఇటీవల ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. మధ్యవర్తులు తనకు నగదు ఇవ్వలేదని ఆమె నిన్న రాత్రి ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ఆందోళన చేసింది.
News September 17, 2025
బుమ్రాకు రెస్ట్?

ఆసియా కప్లో ఇప్పటికే సూపర్-4కు చేరిన భారత్ గ్రూప్ స్టేజ్లో తన చివరి మ్యాచ్ ఎల్లుండి ఒమన్తో ఆడనుంది. ఈ మ్యాచ్లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. UAE, పాక్తో జరిగిన 2 మ్యాచుల్లోనూ బుమ్రా మంచి రిథమ్తో కన్పించారు. ఈ క్రమంలో కీలక ప్లేయర్ అయిన ఆయన గాయాల బారిన పడకుండా ఉండాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బుమ్రా స్థానంలో అర్ష్దీప్ లేదా హర్షిత్ ఆడే ఛాన్స్ ఉంది.
News September 17, 2025
BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<