News April 2, 2025
నాగర్కర్నూల్ జిల్లాలో ఇద్దరి మృతి

నాగర్కర్నూల్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో చికిత్స పొందతూ ఇద్దరు మృతి చెందారు. పోలీసుల వివరాలు.. గగ్గలపల్లికి చెందిన బాలమ్మ(60) అనారోగ్యంతో బాధపడుతుండటంతో మనస్తాపం చెంది ఈనెల 25న పురుగుమందు తాగింది. చికిత్స పొందుతూ నిన్న మృతిచెందింది. అదే గగ్గలపల్లికి చెందిన మల్లమ్మ(45) కూతురి పెళ్లికావటంతో ఒంటరిగా ఫీలై అనారోగ్యంబారిన పడింది. మనస్తాపం చెంది ఈనెల 26న పురుగుమందు తాగగా, చికిత్స పొందుతూ నిన్న చనిపోయింది.
Similar News
News January 1, 2026
ట్రైనీ కానిస్టేబుళ్లకు రూ.12వేలు.. ఉత్తర్వులు జారీ

AP: ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ను రూ.4,500 నుంచి రూ.12వేలకు పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న మంగళగిరిలో జరిగిన నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్టైఫండ్ను పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమం రెండు దశల్లో 9 నెలలపాటు జరగనుంది.
News January 1, 2026
శుభాకాంక్షలు తెలపండి కానీ.. అవి వద్దు: కలెక్టర్

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన జారీ చేశారు. అయితే జనవరి 1 సందర్భంగా తనను కలిసేందుకు వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని కలెక్టర్ సూచించారు. అయితే వసతి సంక్షేమ గృహాలలో చదువుకుంటున్న విద్యార్థుల సౌలభ్యం కోసం అవసరమైన పుస్తకాలు, పెన్నులు, ఇతర విద్యాసామాగ్రి తీసుకురావచ్చని కలెక్టర్ కోరారు.
News January 1, 2026
40’s తర్వాత నిద్ర తగ్గితే ఏం జరుగుతుందో తెలుసా?

40 ఏళ్ల తర్వాత శరీరానికి 7-9 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. 7గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుదలతోపాటు రోజువారీ కార్యకలాపాలకు బాడీ నెమ్మదిగా స్పందిస్తుంది. విటమిన్ డెఫిషియన్సీ, ప్రీ డయాబెటిస్, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత సమస్యలు వచ్చే ప్రమాదముంది.


