News March 26, 2024
విజయనగరం ఎంపీ సీటు.. ఐవీఆర్ఎస్లో ఆ ముగ్గురి పేర్లు..!

విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం TDP ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో మూడు పేర్లను తెరపైకి తీసుకువచ్చారు. సర్వేలో కలిశెట్టి అప్పలనాయుడు, కంది చంద్రశేఖర్, మీసాల గీత అభ్యర్థిత్వాలపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కాగా.. మీసాల గీత విజయనగరం ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడగా.. కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు.
Similar News
News April 1, 2026
VZM: తాగునీటి వేసవి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

వేసవి కాలంలో గ్రామాలు, పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో సురక్షిత తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో తాగునీటి వేసవి ప్రణాళికపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆర్ఓ ప్లాంట్లు లేని పాఠశాలలు, వసతి గృహాల జాబితా సిద్ధం చేసి అవసరమైన చోట జల జీవన్ మిషన్ ద్వారా కుళాయిల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
News April 1, 2026
స్వచ్ఛ సర్వేక్షణ్లో ర్యాంకులు మెరుగుపరచాలి: VZM కలెక్టర్

స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు మున్సిపాలిటీలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, ప్లాస్టిక్ కవర్ల విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News April 1, 2026
స్వచ్ఛ సర్వేక్షణ్లో ర్యాంకులు మెరుగుపరచాలి: VZM కలెక్టర్

స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు మున్సిపాలిటీలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, ప్లాస్టిక్ కవర్ల విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


