News April 2, 2025
బర్డ్ ఫ్లూ అలర్ట్.. ఉడికించిన మాంసమే తినాలి!

AP: నరసరావుపేట బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పచ్చిమాంసానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చిమాంసంలోని సాల్మొనెల్లా, కాంపిలోబ్యాక్టర్, ఇ.కోలి బ్యాక్టీరియా చాలా డేంజర్. అందుకే చికెన్తో పాటు గుడ్లను 100 డిగ్రీలకు పైగా ఉడికించి తినాలి. జబ్బుపడిన పెంపుడు జంతువులు, పక్షులకు దూరంగా ఉండాలి. జ్వరం, జలుబు, దగ్గు తీవ్రస్థాయిలో ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Similar News
News September 11, 2025
మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించింది పింక్ డైమండ్ కాదు: ASI

తిరుమల శ్రీవారికి 1945లో మైసూరు మహారాజు జయచామరా రాజేంద్ర వడియార్ సమర్పించింది పింక్ డైమండ్ కాదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఆలయంలోని పింక్ డైమండ్ మాయమైందని 2018లో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేయడంతో దీనిపై ASI అధ్యయనం చేసింది. తాము సేకరించిన సమాచారం ప్రకారం అది హారం అని, అందులో కెంపులు, రత్నాలు మాత్రమే ఉన్నాయని ASI డైరెక్టర్ వెల్లడించారు.
News September 11, 2025
ఏపీ, తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ కూడా ఏపీలోని అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు టీజీలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
News September 11, 2025
OTTలోకి వచ్చేసిన రజినీకాంత్ ‘కూలీ’

రజినీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.