News April 2, 2025

గద్వాలలో రోడ్డు ప్రమాదం

image

కారు, బైక్ ఢీకొని ఇద్దరికి గాయాలైన ఘటన నిన్న జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల వివరాలు.. కడప జిల్లాకు చెందిన క‌ృష్ణారెడ్డి, కొండారెడ్డి స్పోర్స్ట్ బైక్‌పై HYD వెళ్తున్నారు. జింకలపల్లి స్టేజీ సమీపంలో ముందు వెళ్తున్న కారును ఒక్కసారిగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వీరిని కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News November 6, 2025

వెట్‌ల్యాండ్‌లలో నిర్మాణాలు నిషేధం: అదనపు కలెక్టర్

image

వెట్‌ల్యాండ్‌ల సంరక్షణ ద్వారానే పర్యావరణానికి మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో వెట్‌ల్యాండ్‌ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 467 వెట్ ల్యాండ్‌లు 8,911 హెక్టార్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిల్లో నిర్మాణాలు చేపట్టడం, వ్యర్థాలు వేయడం నిషేధమని ఆయన తెలిపారు. భూ యాజమాన్యం మారదనే విషయాన్ని రైతులు గమనించాలని, ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.

News November 6, 2025

ఏలూరు: ‘రెండో శనివారం సెలవు లేదు’

image

మొంథా తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో ఏలూరు జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజుకు బదులుగా నవంబర్ 8, డిసెంబర్ 13, ఫిబ్రవరి 14 తేదీల రెండో శనివారాల్లో పాఠశాలలు పనిచేయాలని జిల్లా విద్యా అధికారి వెంకటలక్ష్మమ్మ ఆదేశాలు జారీ చేశారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు తప్పనిసరిగా ఈ రోజుల్లో నిర్వహించాలన్నారు.

News November 6, 2025

రాష్ట్రపతిని కలిసిన ఇండియన్ టీమ్

image

WWC గెలిచిన భారత్ జట్టు ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్మును కలిసింది. ఈ సందర్భంగా WC విశేషాలను ప్లేయర్లు పంచుకున్నారు. టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్రపతి.. భవిష్యత్తు తరాలకు రోల్ మోడల్‌గా నిలిచారని కొనియాడారు. విభిన్న ప్రాంతాలు, సామాజిక నేపథ్యాలు, ప్రత్యేక పరిస్థితుల నుంచి వచ్చిన ప్లేయర్లంతా ఇండియాను ప్రతిబింబించారని ముర్ము ప్రశంసించారు. కాగా భారత జట్టు నిన్న PM మోదీని కలిసిన విషయం తెలిసిందే.